‘గోరక్షణ’ దాడులు.. కశ్మీర్‌లో మైనార్టీలపై అరాచకాలు.. భారత్‌పై అమెరికా మత స్వేచ్ఛ నివేదిక

Published : Jun 03, 2022, 03:40 PM IST
‘గోరక్షణ’ దాడులు.. కశ్మీర్‌లో మైనార్టీలపై అరాచకాలు.. భారత్‌పై అమెరికా మత స్వేచ్ఛ నివేదిక

సారాంశం

అమెరికా ప్రభుత్వం మత స్వేచ్ఛపై వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్టులో భారత్‌లోని పరిస్థితులనూ పేర్కొంది. మన దేశంలో గోరక్షణ పేరిట మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, అలాగే, జమ్ము కశ్మీర్‌లోనూ హిందువులు, కశ్మీరీలను లక్ష్యం చేసుకుని దాడులు జరుగుతున్నాయని వివరించింది.

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మత స్వేచ్ఛకు సంబంధించి అమెరికా వార్షిక నివేదికను కాంగ్రెస్‌లో సమర్పించింది. ఈ నివేదిక మొత్తంగా ప్రపంచంలోని మత స్వేచ్ఛను.. అలాగే.. ప్రత్యేకంగా సెక్షన్‌ల వారీగా దేశాల్లోని మత స్వేచ్ఛ వివరాలను పొందుపరించింది. ఈ నివేదిక భారత్‌పైనా మీడియా కథనాలు, ప్రభుత్వ ఏజెన్సీల వివరాల ఆధారంగా సమాచారాన్ని పేర్కొంది. అయితే, సొంత అభిప్రాయం ఇవ్వకుండా అమెరికా జాగ్రత్త పడింది. ఈ నివేదికలో భారత్‌లో మత స్వేచ్ఛ హరించిందనేలా వివరాలను పొందుపరిచింది.

2021 సంవత్సరం పొడుగునా మైనార్టీలపై దాడులు, బెదిరింపులు, వారి హత్యలూ జరిగాయని అమెరికా రక్షణ శాఖ పొందుపరించిన ఈ నివేదిక తెలిపింది. శుక్రవారం ఈ రిపోర్టు విడుదల చేస్తున్న సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, భారత్‌లో ప్రజలపై దాడులు పెరిగాయని అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దాడులు జరుగుతున్నాయని వివరించారు. భారత్‌లో కొందరు అధికారులు ప్రజలపై దాడులు, ప్రార్థనా ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని, ఇంకొందరు అధికారులు ఆ దాడులకు సహకరిస్తున్నారనీ అమెరికా అంబాసిడర్ రషద్ హుస్సేన్ వివరించారు. అదే సందర్భంలో జమ్ము కశ్మీర్‌లోనూ హిందువులు, కశ్మీరీలపై జరుగుతున్న అఘాయిత్యాలను రికార్డు చేసింది.

గో రక్షణ పేరిట మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని అమెరికా రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్టు పేర్కొంది. పశువుల వధ, వ్యాపారం ఆరోపణలతో ఈ దాడులు జరుగుతున్నాయని వివరించింది. అంతేకాదు, మత మార్పిడికి సంబంధించిన చట్టాలనూ పలు రాష్ట్రాలు తెచ్చాయని తెలిపింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలు మత మార్పిడిని అడ్డుకుంటూ చట్టాలు తెచ్చాయని వివరించింది. కాగా, 25 రాష్ట్రాలు పాక్షికంగా లేదా పూర్తిగా పశువుల వధ, వ్యాపారాన్ని నిషేధిస్తూ చట్టాలు రూపొందించాయని పేర్కొంది.

అలాగే, ఫారీన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) 2020 సవరణపైనా భారత దేశంలోని ఎన్జీవోల విమర్శలను ఈ రిపోర్టు రికార్డు చేసింది. కొన్ని మతపరమైన ఎన్జీవోలో తమ కార్యకలాపాల నిర్వహణకు ఈ సవరణ బంధనాలు విధించినట్టు పేర్కొన్న విమర్శలను పొందుపరించింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం