అమానుషం.. విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం పోసిన తోటి విద్యార్థులు..

Published : Aug 01, 2023, 06:46 AM IST
అమానుషం.. విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం పోసిన తోటి విద్యార్థులు..

సారాంశం

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. భిల్వారాలో ఓ పాఠశాల విద్యార్థిని పట్ల తోటీ విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించడంతో కలకలం రేగింది. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను నిలదీయడం ప్రారంభించారు. పోలీసులు లాఠీచార్జి చేస్తూ జనాన్ని చెదరగొట్టారు. గ్రామస్తులు పాఠశాలకు తాళం వేశారు.  

రాజస్థాన్‌లోని భిల్వారాలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. బిల్వారా జిల్లా లుహారియా(Luhariya) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. తోటి విద్యార్థిని వాటర్ బాటిల్ లో మూత్రం పోసి వీరంగం సృష్టించారు. అంతేకాదు.. ఆ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఆ అమ్మాయి పుస్తకం మీద ఐ లవ్ యూ అని రాసి పైశాచిక ఆనందం పొందారు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే వార్త తెలియగానే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రజలు రోడ్డుపైకి వచ్చి రచ్చ సృష్టించడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెరుగుతున్న తోపులాటను చూసిన పోలీసులు ప్రజలను నియంత్రించడానికి ప్రజలపై లాఠీఛార్జ్ ప్రారంభించారు.
 
అందిన సమాచారం ప్రకారం.. భిల్వారాలోని లుహారియా గ్రామంలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని నీళ్ల బాటిల్‌ను టాయిలెట్‌లో నింపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పాఠశాలలో చదువుతున్న ఓ వర్గానికి చెందిన ఇద్దరూ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. వాటర్ బాటిల్‌లో మూత్రం పోయడంతో పాటు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లుహారియా ప్రభుత్వ పాఠశాలకు గ్రామస్తులు తాళం వేశారు. నిందితుడైన విద్యార్థులను పాఠశాల నుంచి బహిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
 
లుహారియా గ్రామంలోని ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ పాఠశాలలో చదువుతున్న ఓ బాలిక మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్లిందని ఫిర్యాదు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఘనశ్యామ్ శర్మ తెలిపారు. బ్యాగును పాఠశాలలోనే వదిలేశారు. కొందరు అబ్బాయిలు బ్యాగ్‌లో పెట్టిన వాటర్ బాటిల్‌ నీ తీసి .. అందులో మూత్రం కలిపారు. దుర్వాసన రావడంతో ఆ బాలిక ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేసింది.  అలాగే.. ఆమె పుస్తకాల్లో ఐ లవ్ యూ అంటూ రాసి ఉందని ఆరోపించింది.

గ్రామంలో కలకలం .. లాఠీచార్జి..

విద్యార్థిని ఫిర్యాదుపై పాఠశాల ప్రిన్సిపాల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఘనశ్యామ్ శర్మ తెలిపారు. దీంతో విద్యార్థిని బంధువులు .. అనుమానిత విద్యార్థుల ఇండ్లపై రాళ్ల దాడి చేశారు. రంగంలో దిగిన పోలీసులు లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. విద్యార్థిని తరపున ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఘనశ్యామ్ శర్మ తెలిపారు. కానీ పాఠశాలలోకి  ప్రవేశించి రాళ్లు రువ్వే వారిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఘనశ్యామ్ శర్మ భారీ పోలీసు బలగాలతో లుహారియన్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!