వ్యాక్సిన్ కోసం వెడితే పోలీసులు చితకబాదారు.. అవమానంతో ఉరేసుకుని యువకుడి మృతి...

By AN TeluguFirst Published Jul 27, 2021, 5:07 PM IST
Highlights

సోమవారం వ్యాక్సిన్ సెంటర్ కి వెళ్లిన ఇరవయ్యేళ్ల యువకుడిని పోలీసులు అడ్డుకుని, లాఠీలతో అతడిమీద దాడి చేశారు. 90 సెకండ్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఉత్తరప్రదేశ్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లిన ఓ యువకుడిని పోలీసులు లోపలికి అనుమతించకపోగా, అతడిమీద దాడిచేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పట్ జిల్లాలో జరిగింది. 

సోమవారం వ్యాక్సిన్ సెంటర్ కి వెళ్లిన ఇరవయ్యేళ్ల యువకుడిని పోలీసులు అడ్డుకుని, లాఠీలతో అతడిమీద దాడి చేశారు. 90 సెకండ్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఆ వీడియోలో ఇద్దరు పోలీసులు అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అందులో జోక్యం చేసుకున్న ఇంకో వ్యక్తిని కూడా తోసేశారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఆ యువకుడు ఊరి చివరి చెట్టుకున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

కరోనామహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన బాధితులు లక్షల్లో ఉంటే.. కొన్ని చోట్ల వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర తోపులాట, వాగ్వాదాలు జరుగుతున్న సంఘటనలు కూడా ఈ మధ్య తరచూ కనిపిస్తున్నాయి. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఐదుగురు పోలీసులకు విధుల నుంచి తొలగించారు. 

click me!