Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు

Published : Jan 12, 2026, 04:08 PM IST
Digital Health

సారాంశం

యోగి ప్రభుత్వం రాష్ట్ర రాజధాని లక్నోలో రెండు రోజులపాటు యూపీ ఏఐ & హెల్త్ ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీన్ని ప్రారంభించారు. 

లక్నో. ఉత్తరప్రదేశ్‌ను దేశంలోనే ఆధునిక, సులభమైన, సాంకేతికతతో కూడిన ఆరోగ్య వ్యవస్థకు మోడల్ రాష్ట్రంగా మార్చే దిశగా యోగి ప్రభుత్వం ఒక చరిత్రాత్మక చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇవాళ్టి(సోమవారం) నుంచి లక్నోలో రెండు రోజుల ‘యూపీ ఏఐ & హెల్త్ ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్’ నిర్వహిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఆరోగ్య సేవలతో అనుసంధానించి, సామాన్య పౌరులకు మెరుగైన, సకాలంలో చికిత్స అందించడమే ఈ సదస్సు లక్ష్యం.

ఈ సదస్సును ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి సునీల్ కుమార్ శర్మ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి అజిత్ సింగ్ పాల్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి మయంకేశ్వర్ శరణ్ సింగ్ హాజరయ్యారు. 

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ సంస్థల భాగస్వామ్యం

ఈ కాన్ఫరెన్స్‌లో స్టేట్ ట్రాన్స్‌ఫర్మేషన్ కమిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనోజ్ కుమార్ సింగ్, వైద్య ఆరోగ్యం, వైద్య విద్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అమిత్ కుమార్ ఘోష్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ యాదవ్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

దీంతో పాటు నీతి ఆయోగ్, జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ప్రపంచ బ్యాంకు, గేట్స్ ఫౌండేషన్, గూగుల్‌తో సహా దేశ, విదేశాల ఏఐ, ఆరోగ్య రంగ నిపుణులు వివిధ సెషన్లలో పాల్గొంటారు.

ఉత్తరప్రదేశ్ ఆరోగ్యం, డిజిటల్ పురోగతిపై దృష్టి సారించే సదస్సు

గత కొన్నేళ్లుగా ఉత్తరప్రదేశ్ ఆరోగ్య మౌలిక సదుపాయాలు, వైద్య విద్య, డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడుల రంగంలో గొప్ప పురోగతి సాధించింది. ఈ సదస్సు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘డిజిటల్ ఉత్తరప్రదేశ్’, ‘స్మార్ట్ హెల్త్ సిస్టమ్’ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ఒక అడుగు. మొదటి రోజు ప్రారంభ సెషన్‌లో ఉత్తరప్రదేశ్‌లో ఏఐ ఆధారిత ఆరోగ్య ఆవిష్కరణల విజన్‌ను ప్రదర్శిస్తారు.

మెడికల్ రంగంలో ఏఐపై చర్చ

సోమవారం జరిగే వివిధ సెషన్లలో ప్రపంచ స్థాయిలో హెల్త్‌కేర్‌లో ఏఐ విజయవంతమైన ప్రయోగాలు, ఆర్థికాభివృద్ధి, సామాజిక సంక్షేమంలో ఏఐ పాత్ర, భారత రాష్ట్రాల్లో ఏఐ ప్రస్తుత పరిస్థితిపై చర్చ సాగింది.. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, డేటా గవర్నెన్స్, సురక్షిత ఏఐ స్వీకరణ వంటి అంశాలపై చర్చల ద్వారా ఉత్తరప్రదేశ్ విధానం, సాంకేతికత సమతుల్యంతో ఆరోగ్య సేవలను ఎలా మరింత ప్రభావవంతంగా మార్చగలదో స్పష్టమవుతుంది.

రెండో రోజు చికిత్స, డయాగ్నస్టిక్స్, భవిష్యత్ సన్నద్ధతపై దృష్టి

మంగళవారం సదస్సు రెండో రోజు పూర్తిగా ఆచరణాత్మక ఉపయోగంపై దృష్టి పెడుతుంది. ఏఐ ద్వారా డాక్టర్లు, నర్సులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలను శక్తిమంతం చేయడం, టెలిమెడిసిన్, రిమోట్ కేర్‌ను గ్రామీణ ప్రాంతాలకు చేర్చడంపై ప్రత్యేక సెషన్లు ఉంటాయి.

పరీక్షలు, చికిత్సలో ఏఐ వాడకంపై ప్రత్యేక సెషన్

రేడియాలజీ, టీబీ స్క్రీనింగ్, పాథాలజీ, క్యాన్సర్, స్మార్ట్ మెడికల్ డివైజ్‌లలో ఏఐ వాడకంతో వేగవంతమైన, కచ్చితమైన పరీక్షల అవకాశాలపై చర్చిస్తారు. స్టార్టప్ పిచ్ సెషన్, రాష్ట్రాల కోసం ఏఐ రోడ్‌మ్యాప్ రాబోయే కాలంలో ఆరోగ్య సేవలు ఎలా మరింత చవకగా, సులభంగా మారగలవో చూపిస్తాయి.

ఇన్నోవేషన్ & ఎక్స్‌పీరియన్స్ జోన్ ఆకర్షణ కేంద్రంగా నిలుస్తుంది

సదస్సు సందర్భంగా ఇన్నోవేషన్ & ఎక్స్‌పీరియన్స్ జోన్‌లో ఏఐ ఆధారిత హెల్త్ సొల్యూషన్స్, స్టార్టప్‌లు, ఉత్తరప్రదేశ్‌లో అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్టుల లైవ్ ప్రదర్శన ఉంటుంది. ఈ జోన్ విధానం, సాంకేతికత మధ్య వారధిగా పనిచేసి, భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థ రూపురేఖలను చూపిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu