సామాజిక సమానత్వం కోసమే ఈబీసీ బిల్లు: కేంద్రమంత్రి గెహ్లాట్

sivanagaprasad kodati |  
Published : Jan 09, 2019, 01:04 PM IST
సామాజిక సమానత్వం కోసమే ఈబీసీ బిల్లు: కేంద్రమంత్రి గెహ్లాట్

సారాంశం

అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు నిమిత్తం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించకుండా విపక్షాలు అడ్డుపడుతండటంపై కేంద్రమంత్రి థావర్ చంద్ స్పందించారు

అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు నిమిత్తం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించకుండా విపక్షాలు అడ్డుపడుతండటంపై కేంద్రమంత్రి థావర్ చంద్ స్పందించారు. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసమే ఈ బిల్లు రూపొందించినట్లు తెలిపారు.

విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు అందుతాయని, ‘‘సబ్‌కా సాథ్...సబ్‌కా వికాస్’’ నినాదం పరిపూర్ణం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. మంచి ఉద్దేశ్యంతో ఈబీసీ రిజర్వేషన్ల చట్టం చేస్తున్నామన్నారని థావర్ చంద్ తెలిపారు.

అగ్రకులాల్లోనూ పేదరికంలో మగ్గుతున్నారని..  ఆఖరికి చదువుకోవాలన్నా, వాళ్లు బ్యాంకు లోన్లు తీసుకుంటున్నారని గెహ్లాట్ ఆవేదన వ్యక్తం చేశారు. పేద-గొప్ప అనే తారతమ్యం లేకుండా, సామాజిక సమానత్వం కోసమే ఈబీసీ రిజర్వేషన్లకు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు.  

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్