PM Vishwakarma scheme: చాాలా తక్కువ వడ్డీకే రూ. 1 లక్ష రుణం అందించనున్న కేంద్రం.. అర్హులు వీళ్లే..

Published : Aug 16, 2023, 06:58 PM ISTUpdated : Aug 16, 2023, 07:03 PM IST
PM Vishwakarma scheme: చాాలా తక్కువ వడ్డీకే రూ. 1 లక్ష రుణం అందించనున్న కేంద్రం..  అర్హులు వీళ్లే..

సారాంశం

PM Vishwakarma scheme: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన ‘ప్రధానమంత్రి విశ్వకర్మ’ పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద చేతివృత్తులు, కళాకారులకు రూ. 1 లక్ష వరకు అతి తక్కువ వడ్డీకే రుణం ఇస్తారు.

PM Vishwakarma scheme: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'విశ్వకర్మ యోజన' అనే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పథకానికి మోదీ మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. దీని పూర్తి పేరు ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన' లేదా 'PM వికాస్ యోజన'. ఈ పథకం ఒక నిర్దిష్ట శైలిలో నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం ఉంటుంది. 'విశ్వకర్మ యోజన'లో 13 నుంచి 15 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు.
 
'విశ్వకర్మ యోజన' 17 సెప్టెంబర్ 2023న విశ్వకర్మ పూజ సందర్భంగా ప్రారంభించబడుతుంది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు కూడా. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ పథకాన్ని ప్రకటించారు. దీని కింద ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, శిక్షణ, ఆధునిక సాంకేతికత, గ్రీన్ టెక్నాలజీపై శిక్షణ, బ్రాండ్‌ల ప్రచారం, డిజిటల్ చెల్లింపులు, స్థానిక, ప్రపంచ మార్కెట్‌లకు అనుసంధానంతో సామాజిక భద్రత కల్పించడం.  

నైపుణ్య శిక్షణ, సాంకేతికత, ఆర్థిక సహాయం అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు, హస్తకళాకారుల సామర్థ్యాలను మెరుగుపరచడం 'ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన' లక్ష్యం. ఈ పథకం కింద, నైపుణ్యం కలిగిన కళాకారులు కూడా MSMEలతో అనుసంధానించబడతారు. తద్వారా వారు మెరుగైన మార్కెట్‌ను పొందవచ్చు.

పథకం ద్వారా ప్రయోజనం పొందేవారు వీరే.. 

ఈ పథకం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, OBCలు, మహిళలు, బలహీన వర్గాల వారు ప్రయోజనం చేకూరుతుంది. వడ్రంగి, స్వర్ణకారుడు, శిల్పి, కుమ్మరి రంగాలలో పనిచేసే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు. ఈ పథకం ద్వారా హస్తకళాకారుల ఉత్పత్తులు, సేవల నాణ్యతను పెంపొందించడంతో పాటు దేశీయ మార్కెట్, ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం చేయడం ప్రభుత్వ లక్ష్యం.  

విశ్వకర్మ యోజన ప్రత్యేకతలు: -

  • ఈ పథకం కింద నైపుణ్యాలు, సాధనాలు, ఆర్థిక మద్దతు, మార్కెట్ మద్దతు అందించబడతాయి.
  • నైపుణ్య శిక్షణ  (బేసిక్, అడ్వాన్స్‌డ్) అందించబడుతుంది. 
  • శిక్షణ సమయంలో రోజుకు రూ.500 స్టైఫండ్ కూడా ఇస్తారు.
  • ఆధునిక పనిముట్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.15 వేలు సహాయం చేస్తుంది.  
  • లక్ష రూపాయల వరకు రుణం ఇస్తారు. దీనిపై గరిష్టంగా 5% వడ్డీ ఉంటుంది.
  • తదుపరి విడతలో 2 లక్షల వరకు రుణం లభిస్తుంది.
  • బ్రాండింగ్, ఆన్‌లైన్ మార్కెట్ యాక్సెస్ వంటి సపోర్ట్ అందించబడుతుంది.
     

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Italy Tour Highlights: మోదీ విజన్ కి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఫిదా| Asianet News Telugu
PM Modi Oslo Visit: ఒస్లో పర్యటనలో మోదీకి అదిరిపోయే స్వాగతం| Asianet News Telugu