
దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు పన్నుల ఊరట ఉంటుందా? నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయా? ఇంధనం, విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో కీలక నిర్ణయాలేమైనా ఉంటాయా? అనే అంశాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
రైతులకు మద్ధతు ధరలు, యువతకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపార రంగానికి ప్రోత్సాహకాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలు ఈ బడ్జెట్లో ప్రధానంగా ఉండే అవకాశముంది.
ఈ కీలక బడ్జెట్ ప్రసంగాన్ని ఏసియానెట్ న్యూస్ తెలుగు YouTube ఛానెల్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించండి.