చెన్నైలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు యువతుల మృతి

Siva Kodati |  
Published : Jul 16, 2019, 03:27 PM ISTUpdated : Jul 16, 2019, 04:45 PM IST
చెన్నైలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు యువతుల మృతి

సారాంశం

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు.

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. చెన్నైలో ఉద్యోగులుగా పనిచేస్తోన్న శివన్, లక్ష్మీ, భవాని అనే ముగ్గురు సోమవారం ఒకే మోటార్‌ సైకిల్‌పై ఆఫీసుకు వెళ్తుండగా... వీరి వాహనాన్ని మరో బైక్ ఢీకొట్టింది. దీంతో వీరంతా అదుపుతప్పి బస్సు కింద పడటంతో చక్రాలు వీరి మీదుగా వెళ్లాయి. ఈ ప్రమాదంలో లక్ష్మీ, భవానీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన శివన్ రాయపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

PREV
click me!

Recommended Stories

New Rules : గ్యాస్ సిలిండర్ నుంచి యూపీఐ, ఏటిఎం వరకు .. జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్
Richest CM : దేశంలోనే రిచ్ సీఎం ఎవరో తెలుసా? చంద్రబాబు, విజయ్‌ ల సంగతేంటి? ?