గులాం నబీ ఆజాద్‌కి వీడ్కోలు: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

Published : Feb 09, 2021, 11:18 AM IST
గులాం నబీ ఆజాద్‌కి వీడ్కోలు: కన్నీళ్లు పెట్టుకొన్న మోడీ

సారాంశం

 రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యాడు. 

న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యాడు. మంళవారం నాడు రాజ్యసభ నుండి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రిటైర్ కానున్నారు. దీంతో ఆయన సేవలను పలువురు కొనియాడారు.

ఆజాద్ చేసిన సేవల గురించి ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  అధికారంలో ఉన్నా లేకున్నా ఆజాద్ ఒకేలా ఉన్నారని ఆయన చెప్పారు. ఆజాద్ దేశానికి సేవలు చిరస్మరణీయమైనవన్నారు. ఆజాద్ కు ఆయన సెల్యూట్ చేశారు.

ఆజాద్ ఎందరో ఎంపీలకు ఆదర్శమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆజాద్ కు మోడీ సెల్యూట్ చేశారు. ఆజాద్ ను తాను నిజమైన స్నేహితుడిగా భావిస్తున్నట్టుగా ప్రధాని చెప్పారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడ మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.

ఉగ్రవాదుల దాడి కారణంగా గుజరాత్ నుండి వచ్చిన ప్రజలు కాశ్మీర్ లో చిక్కుకొన్న సమయంలో ఆజాద్ తో పాటు ప్రణబ్ ముఖర్జీ సేవలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఆజాద్ తనకు చాలా ఏళ్లుగా తెలుసునని చెప్పారు. మేమిద్దరం చాలా కాలం ముఖ్యమంత్రులుగా పనిచేశామన్నారు. అంతేకాదు రాజకీయాల్లో కూడ చాలా ఏళ్లుగా ఉన్నామన్నారు. తాను సీఎం కావడానికి ముందు ఆజాద్ తో మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu