Tomato: రూ.21 లక్షల విలువైన టమాటాలతో లారీ మిస్సింగ్..

Mahesh Rajamoni | Published : Jul 31, 2023 9:54 AM

Jaipur: టమాటాల ధ‌ర‌లు మండిపోతున్న తరుణంలో రూ.21 లక్షల విలువైన టమాటాలతో లోడ్ చేసిన ట్ర‌క్కు కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. ట్రక్కు ఏదైనా ప్రమాదానికి గురైందా లేక నెట్ వర్క్ సమస్య కార‌ణంగా కాంటాక్ట్ పై ప్రభావం చూపుతోందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూ.21 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న లారీ గల్లంతైందనీ, ఈ ట్రక్కు రాజస్థాన్ లోని కోలార్ నుంచి జైపూర్ వెళ్తోందని పోలీసులు తెలిపారు.   

Truck with tomatoes worth Rs 21 lakh missing: టమాటాల ధ‌ర‌లు మండిపోతున్న త‌రుణంలో  రూ.21 లక్షల విలువైన టమాటాలతో లోడ్ చేసిన ట్ర‌క్కు మిస్సైంది. ట్రక్కు ఏదైనా ప్రమాదానికి గురైందా లేక నెట్ వర్క్ సమస్య కార‌ణంగా కాంటాక్ట్ పై ప్రభావం చూపుతోందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రూ.21 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న లారీ గల్లంతైందనీ, ఈ ట్రక్కు రాజస్థాన్ లోని కోలార్ నుంచి జైపూర్ వెళ్తోందని పోలీసులు తెలిపారు.

టమోటా లోడ్ లారీ గురించి పోలీసులు, వ్యాపారీ చెప్పిన పూర్తి వివ‌రాలు ఇలా వున్నాయి.. రాజస్థాన్ లోని జైపూర్ కు రూ.21 లక్షల విలువైన టమాటాలతో వెళ్తున్న లారీ అదృశ్యం కావడంతో కోలార్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. ట‌మాటాలు రికార్డు స్థాయిలో చేరుకున్నాయి. కిలో టమాటా ధర 150కి పైగా పెరిగిన తర్వాత కర్ణాటకలో నమోదైన మూడో అనుమానిత టమాటా చోరీ ఇది. సరుకులు కోల్పోయిన కోలార్ కు చెందిన వ్యాపారులు ఆదివారం కోలార్ నగర పోలీసులను ఆశ్రయించి లారీ ఆచూకీ కనుగొనేందుకు సహాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోలార్ పోలీసులు విచారణ చేపట్టారు.

టమోటా లోడ్ ముగ్గురు వ్యాపారులకు చెందినది, వారు ఉత్పత్తులను జైపూర్ కు పంపడానికి ప్ర‌యివేటు రవాణాను ఉపయోగించారు. లారీ డ్రైవర్ ను గానీ, ట్రాన్స్ పోర్టు ఆపరేటర్లను గానీ సంప్రదించలేకపోయామని ముగ్గురు వ్యాపారుల్లో ఒకరైన మునిరెడ్డి విలేకరులకు తెలిపారు. లారీ డ్రైవర్ తన సహాయకుడితో కలిసి గురువారం కోలార్ నుంచి బయలుదేరగా, డ్రైవర్ శనివారం వరకు వ్యాపారులతో టచ్ లో ఉన్నాడు. అయితే ఆదివారం ఉదయానికి జీపీఎస్ స్విచ్ఛాఫ్ అయిందనీ, డ్రైవర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని గుర్తించామని మునిరెడ్డి తెలిపారు. దీనిపై వ్యాపారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుండ‌గా, డ్రైవర్ టమోటాలను దొంగిలించాడా లేక హైవేపై లారీని హైజాక్ చేశారా అనేది తమకు తెలియదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పేర్కొన్నారు.

ట‌మాటాల లారీ 1,800 కిలోమీటర్లు ప్రయాణించిందనీ, జీపీఎస్ సంబంధాలు తెగిపోవ‌డానికి ముందు చివరి ప్రదేశం మహారాష్ట్రలోని నాసిక్ గా గుర్తించామ‌ని పోలీసులు తెలిపారు. కాగా, నాసిక్ ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ ను కలిగి ఉండగా, కోలార్ రెండవ అతిపెద్ద మార్కెట్ ను కలిగి ఉంది. డ్రైవర్ లోడ్ ను దొంగిలించి నాసిక్ లో విక్రయించేందుకు తీసుకెళ్లి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని తమ సహచరులను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నామనీ, నాసిక్ లో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని వ్యాపారులను కోరినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

మ‌రో ఘ‌ట‌న‌లో..

ఈ నెల 2న చిత్రదుర్గకు చెందిన ఓ రైతు నుంచి రెండున్నర టన్నుల టమాటాలతో కూడిన ట్రక్కును హైజాక్ చేసిన దంపతులను బెంగళూరు నగర పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైజాక్ చేసిన ట్రక్కును తమిళనాడుకు తీసుకెళ్లి టమోటాలు అమ్ముకున్నారు. ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు హసన్ జిల్లా బేలూరు తాలూకాలో పొలంలో పండించిన టమోటాలు చోరీకి గురయ్యాయి.

Read more Articles on
click me!