Tripura: జంతుబ‌లుల‌పై త్రిపుర స‌ర్కార్ కీల‌క ఉత్త‌ర్వులు

Published : Jul 10, 2022, 05:12 AM IST
Tripura: జంతుబ‌లుల‌పై త్రిపుర స‌ర్కార్ కీల‌క ఉత్త‌ర్వులు

సారాంశం

Tripura:  బక్రీద్ సందర్భంగా అగర్తల పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి జంతువును బలి ఇవ్వరాదని పశు వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్ టీకే దేబ్‌నాథ్ శనివారం తెలిపారు. ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

Tripura: బక్రీద్ 2022 సందర్భంగా అగర్తల పట్టణ ప్రాంతాల్లో జంతువులను బలి ఇవ్వరాదని త్రిపుర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పశు వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి డాక్టర్‌ టీకే దేబ్‌నాథ్‌ శనివారం ప్రకటించారు. బక్రీద్ (ఈద్-అల్-అదా) సందర్భంగా అగర్తల పట్టణ ప్రాంతాల్లో ఏ జంతువును బలి ఇవ్వరాదని ఆయన చెప్పారు. ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే.. వారిని క‌ఠినంగా శిక్ష పడుతుంది.

ఈ క్ర‌మంలో డాక్టర్ దేబ్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. బక్రీద్ రోజున‌ అగర్తల పట్టణ ప్రాంతాల్లో ఏ జంతువును వధించడానికి అనుమతించబడదు. ఇది జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే (స్లాటర్‌హౌస్) నియమాలు 2001కి సంబంధించినది.  చట్టవిరుద్ధంగా.. జంతు వ‌ధ చేసి వారిని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌నీ,  వారి శిక్ష పడుతుంది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960, జంతువులపై క్రూరత్వం నిరోధక (స్లాటర్‌హౌస్) రూల్స్ 2001ని ప్రస్తావిస్తూ.. దీనిపై దేశవ్యాప్తంగా సంబంధిత శాఖలకు లేఖ పంపామని తెలిపారు.

అలాగే.. జంతువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చేస్తున్నారని, ఫలితంగా రవాణా సమయంలో చాలా జంతువులు చనిపోతాయని ఆయన అన్నారు. జంతువులపై క్రూరత్వ నివారణ (స్లాటర్‌హౌస్) రూల్స్ 2001 ప్రకారం గర్భిణీ జంతువులు, జబ్బుపడిన జంతువులు, మూడు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న దూడలను వధించరాదనీ, అలా చేసిన వారు పై నిబంధనల ప్రకారం శిక్షించబడతారని హెచ్చ‌రించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్, డీజీపీకి ఆదేశాలు

ఆర్డర్ ప్రకారం.. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం (1960) ప్రకారం మార్గదర్శకాలను అనుసరించి పేర్కొన్న ప్రదేశాలలో జంతువులను వధించడానికి అనుమతించబడుతుంది. ఈ నోటిఫికేషన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్, రాష్ట్ర డీజీపీకి సమాచారం అందించామని టీకే దేబ్‌నాథ్ తెలిపారు. ARDD నోటిఫికేషన్ నేప‌థ్యంలో బక్రీద్ సందర్భంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అగర్తలలోని అన్ని సున్నితమైన ప్రాంతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ హై అలర్ట్ ప్ర‌క‌టించిన‌ట్టు తెలిపారు. 

'ఆవును బలి ఇవ్వకండి'

బక్రీద్ సందర్భంగా ఆవులను బలి ఇవ్వవద్దని ఇటీవల జమియత్ ఉలేమా అస్సాం యూనిట్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ ముస్లింలకు విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఇలా చేయడం వల్ల హిందూ సమాజంలోని ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. హిందూ సమాజంలోని ప్రజలు ఆవును తల్లిగా భావించి పూజిస్తారని ఆయన అన్నారు. వారి మనోభావాలను దెబ్బతీయకూడదు.

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu