బెంగాల్ లో దేవాలయం గోడ కూలి నలుగురు మృతి

Published : Aug 23, 2019, 12:28 PM IST
బెంగాల్ లో దేవాలయం గోడ కూలి నలుగురు మృతి

సారాంశం

ఓ దేవాలయం ద్ద గోడ కూలి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనబెంగాల్ రాష్ట్రంలో గురువారం నాడు చోటు చేసుకొంది. 


కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర పరగణ జిల్లాలోని  కచువాలో ఓ దేవాలయం గోడ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గురువారం నాడు ఉదయం వందలాది మంది ఈ దేవాలయం వద్దకు వచ్చారు.ఈ సమయంలో దేవాలయం గోడ కూలింది. గోడకూలిన సమయంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన లోక్‌నాథ్ బాబా మందిరం వద్ద చోటు చేసుకొంది.ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడినట్టుగా పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం