జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాది రియాజ్ నాయక్ అరెస్ట్

Published : May 06, 2020, 11:13 AM ISTUpdated : May 06, 2020, 11:49 AM IST
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాది రియాజ్ నాయక్ అరెస్ట్

సారాంశం

జమ్మూకాశ్మీర్ లోని అవంతీపురలో ఉగ్రవాది రియాజ్ నాయక్ ను భద్రతా దళాలు బుధవారం నాడు ఉదయం అరెస్టు చేశాయి. అతడిని హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ గా పోలీసులు ప్రకటించాయి.


శ్రీనగర్:జమ్మూకాశ్మీర్ లోని అవంతీపురలో ఉగ్రవాది రియాజ్ నాయక్ ను భద్రతా దళాలు బుధవారం నాడు ఉదయం అరెస్టు చేశాయి. అతడిని హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ గా పోలీసులు ప్రకటించాయి.

అతడిపై రూ. 12 లక్షల రివార్డు ఉన్నట్టుగా భద్రతా దళాలు ప్రకటించాయి. ఈ ప్రాంతంలోని టెర్రరిస్టు గ్రూపులకు రియాజ్ పెద్ద దిక్కుగా ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.

అవంతిపురలో  ఉగ్రవాదుల కోసం నిర్వహించిన వేటలో  అతను చిక్కాడని పోలీసులు ప్రకటించారు. మంగళవారం నాడు రాత్రి ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. ఈ సమయంలో ఉగ్రవాదుల్లో అగ్రనేత ఉన్నారని సమాచారం అందిందన్నారు.

భద్రతాదళాల దాడుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. రియాజ్ పోలిసులకు చిక్కాడు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో అవంతీపురలో ఉందని పోలీసులు తెలిపారు.  ఆర్మీకి చెందిన 50ఆర్ఆర్, సీఆర్‌పీఎఫ్ కు చెందిన బిఎన్ 185, పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సమయంలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకొన్నాయని పోలీసులు ప్రకటించారు.

కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరిన ఘటనలో సీఆర్‌పీఎఫ్ 181 బెటాలియన్ కు చెందిన ఓ జవాన్  మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. జవాన్ తో పాటు నలుగురు పౌరులకు కూడ గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం నాడు చోటు చేసుకొంది.  

దోడా జిల్లాలోని గుండావా ప్రాంతంలో ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకొంది. అరెస్ట్ చేసిన ఉగ్రవాదిని తన్వీర్ అహ్మద్ మాలిక్ గా గుర్తించారు.
 

PREV
click me!

Recommended Stories

Air Pollution: గాలి కాలుష్యంతో సూసైడ్ ఆలోచనలు.. రీసెర్చ్‌ లో మైండ్ బ్లాకింగ్ విషయాలు
Indian Railways Free Travel: నవంబర్ 1 నుంచి రైల్వే కొత్త రూల్.. వారికి ఉచితంగా ఏసీ ట్రావెల్ !