ఛత్తీస్‌గఢ్‌: మందుపాతర పేల్చిన మావోలు.. ముగ్గురు పోలీసుల దుర్మరణం

Siva Kodati |  
Published : Mar 23, 2021, 07:25 PM ISTUpdated : Mar 23, 2021, 07:26 PM IST
ఛత్తీస్‌గఢ్‌: మందుపాతర పేల్చిన మావోలు.. ముగ్గురు పోలీసుల దుర్మరణం

సారాంశం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లా రిజర్వు గార్డ్స్‌ (డీఆర్‌జీ) సిబ్బంది వెళ్తున్న బస్సును మందుపాతరలతో పేల్చేశారు. నారాయణపూర్‌ జిల్లాలో మంగళవారం 27మంది సిబ్బందితో వెళ్తున్న బస్సును లక్ష్యంగా మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లా రిజర్వు గార్డ్స్‌ (డీఆర్‌జీ) సిబ్బంది వెళ్తున్న బస్సును మందుపాతరలతో పేల్చేశారు. నారాయణపూర్‌ జిల్లాలో మంగళవారం 27మంది సిబ్బందితో వెళ్తున్న బస్సును లక్ష్యంగా మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

నారాయణపూర్‌ జిల్లాలోని కడేనార్‌, కన్హరగావ్‌ల మధ్య వెళ్తున్న ఈ బస్సును లక్ష్యంగా చేసుకొని ఐఈడీ పేల్చారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డీఎం అవస్థీ మాట్లాడుతూ.. కూంబింగ్ నిర్వహించి తిరిగి క్యాంపులకు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని మావోలు తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు