ఏవోబీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి ముగ్గురు మృతి, 7 మందికి తీవ్ర గాయాలు..

Published : May 04, 2023, 03:27 PM IST
ఏవోబీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ట్రాలీ  బోల్తా పడి ముగ్గురు మృతి, 7 మందికి  తీవ్ర గాయాలు..

సారాంశం

ఏవోబీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బాదపడ పంచాయతీ పరిధిలోని ఖరిమల్ వద్ద బుధవారం రాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

ఏవోబీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బాదపడ పంచాయతీ పరిధిలోని ఖరిమల్ వద్ద బుధవారం రాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్‌‌లో ప్రయాణిస్తున్నవారంతా.. తంటగూడ గ్రామంలో బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి  వస్తుండగా  ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 15 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన వారందరినీ ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని జాన్‌బాయి వైద్యశాలకు తరలించారు. అయితే తర్వాత వారిని మెరుగైన చికిత్స నిమిత్తం చిత్రకొండ ఆసుపత్రికి తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu