భార‌త్ జోడో యాత్ర‌ను ఆప‌డానికే ఈ కోవిడ్ డ్రామా.. : బీజేపీ స‌ర్కారుపై కాంగ్రెస్ ఫైర్

Published : Dec 23, 2022, 06:13 PM IST
భార‌త్ జోడో యాత్ర‌ను ఆప‌డానికే ఈ కోవిడ్ డ్రామా.. :  బీజేపీ స‌ర్కారుపై కాంగ్రెస్ ఫైర్

సారాంశం

New Delhi: కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భార‌త్ జోడో యాత్ర హర్యానా గుండా మొదటి దశ చివరి రోజున ఫరీదాబాద్ కు చేరుకుంది. శనివారం ఉదయం దేశరాజ‌ధాని ఢిల్లీకి చేరుకుంటుంది. కొంతమంది అథ్లెట్లతో పాటు, డీఎంకే ఎంపీ కనిమొళి కూడా యాత్రలో పాల్గొన్నారు. అయితే, భార‌త్ జోడో యాత్ర‌ను ఆప‌డానికి కేంద్ర‌లోని బీజేపీ స‌ర్కారు కోవిడ్ డ్ర‌మాకు తెర‌లేపింద‌ని కాంగ్రెస్ ఆరోపించింది.  

Congress Bharat Jodo Yatra: ఢిల్లీలోకి అడుగుపెట్టనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం కోవిడ్ డ్రామా ఆడుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ నేతృత్వంలోని భార‌త్ జోడో యాత్ర హర్యానా గుండా మొదటి దశ చివరి రోజున ఫరీదాబాద్ కు చేరుకుంది. శనివారం ఉదయం దేశరాజ‌ధాని ఢిల్లీకి చేరుకుంటుంది. కొంతమంది అథ్లెట్లతో పాటు, డీఎంకే ఎంపీ కనిమొళి కూడా యాత్రలో పాల్గొన్నారు. అయితే, భార‌త్ జోడో యాత్ర‌ను ఆప‌డానికి కేంద్ర‌లోని బీజేపీ స‌ర్కారు కోవిడ్ డ్ర‌మాకు తెర‌లేపింద‌ని కాంగ్రెస్ ఆరోపించింది. పఖల్ గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో  జైరామ్ రమేష్ మాట్లాడుతూ, "గత రెండు రోజులుగా ఈ మొత్తం కోవిడ్ డ్రామా భారత్ జోడో యాత్రను ఢిల్లీకి రాకుండా అపఖ్యాతి పాలు చేయడానికి, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికి రూపొందించబడింది. రాహుల్ గాంధీ యాత్ర‌ను అడ్డుకోవ‌డం.. అదొక్కటే లక్ష్యం' అని బీజేపీ స‌ర్కారుపై ఫైర్ అయ్యారు. 

కాగా, అంత‌కుముందు రోనా వైర‌స్ ప్రోటోకాల్స్ పాటించకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయడం లేదా వాయిదా వేయడం గురించి ఆలోచించాలని కోరుతూ కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ లకు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండ‌వీయ లేఖ రాశారు. దీనిపై కాంగ్రెస్ తో పాటు ఇత‌ర ప్ర‌తిప‌క్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై ఘాటుగానే స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించాయి. శాస్త్రీయ, వైద్య సలహాల ఆధారంగా ఏ ప్రోటోకాల్ ను అయినా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని జైరామ్ ర‌మేష్ అన్నారు. తాము ఎల్లప్పుడూ కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రిస్తాము.. ప్ర‌జ‌ల శ్రేయ‌స్సుకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. 'మహాభారత యుద్ధం మాదిరిగా కోవిడ్ పరిస్థితి (2020 లో వ్యాప్తి చెందిన తరువాత) 18 రోజుల్లో గెలుస్తుందని ఒక పరిష్కారం ఇచ్చిన పార్టీ మేము కాదు" అని బీజేపీ తీరుపై మండిప‌డ్డారు.

'18 రోజుల్లో కోవిడ్ యుద్ధంలో విజయం సాధిస్తామని ఒక పెద్దమనిషి చెప్పారు, ఒక పెద్దమనిషి తమ బాల్కనీలకు వెళ్లి 'థాలీలు' కొట్టడం ద్వారా మహమ్మారిని ఎదుర్కోవాలని భారతీయులకు సలహా ఇచ్చారు. ఇవి కోవిడ్ కు ఇచ్చిన నివారణలు అని మీకు గుర్తుంటే.." అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బీజేపీ తీరును ఎత్తిచూపారు. శాస్త్రీయ లేదా వైద్య ప్రోటోకాల్ ఉంటే, మేము దానిని స్వచ్ఛందంగా అనుసరిస్తాము జైరామ్ రమేష్ చెప్పారు.

ప్రధాని ధరించిన మాస్కు స‌మ‌యం కంటే ఎక్కువ సమయం తాను మాస్కు ధరించానని పేర్కొన్న ఆయ‌న  ప్రధాని మాస్కు కేవ‌లం టీవీ  ప్ర‌క‌ట‌న‌ల‌కోసమేనని విమ‌ర్శించారు. అలాగే, భార‌త్ జోడో యాత్ర‌లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడంపై కేంద్ర ఆరోగ్య మంత్రి రాహుల్ గాంధీకి రాసిన లేఖ నిపుణుల లేదా శాస్త్రీయ సలహాపై కాకుండా ముగ్గురు బీజేపీ ఎంపీలు చేసిన ఆందోళనల ఆధారంగా ఉందని జైరాం రమేష్ ఆరోపించారు. భార‌త్ జోడో యాత్ర‌ను అడ్డుకోవ‌డానికి ప్రభుత్వం క‌రోనా సాకులు చెబుతోందని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్