మహిళల స్థితిగతులను బట్టే.. దేశ విలువ ఆధారపడి ఉంటుంది - సీజేఐ చంద్రచూడ్

Published : Nov 10, 2023, 12:36 PM IST
మహిళల స్థితిగతులను బట్టే.. దేశ విలువ ఆధారపడి ఉంటుంది - సీజేఐ చంద్రచూడ్

సారాంశం

మహిళలకు ఇచ్చే విలువలను బట్టే దేశ విలువ ఆధారపడి ఉంటుందని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. మహిళలకు విలువ ఇవ్వడం ప్రధానంగా పురుషుల సమస్య అని అన్నారు. లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏర్పాటు ఓ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు.

మహిళల స్థితిగతులను బట్టి దేశ విలువ నిర్ణయించబడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. సామాజిక సంక్షేమ చర్యల ప్రయోజనాలు వాస్తవంగా పౌరులకు చేరేలా ముందుచూపుతో కూడిన విధానాలు, తీర్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీ డబ్ల్యూ), నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

delhi air pollution : సరి-బేసి విధానం సత్ఫలితాలనే ఇచ్చింది - సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పిన ఢిల్లీ సర్కార్ 

భారతదేశంలో అద్భుతమైన చట్టాలు ఉన్నాయని, వాటిని సద్విశ్వాసంతో అమలు చేస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. అయితే విస్తారమైన, వైవిధ్యభరితమైన దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరివర్తన సామర్థ్యాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల హక్కుల సాధనగా మార్చడం నిజమైన సవాలు అని ఆయన అన్నారు. ఒక కుటుంబం విలువ మహిళల స్థితిని బట్టి నిర్ణయించబడుతుందని, కాబట్టి భవిష్యత్తు కోసం మన ప్రయాణంలో, ఒక జాతిగా మన విలువ ఎక్కువగా మహిళలకు మనం నిర్దేశించే విలువపై ఆధారపడి ఉంటుందని అన్నారు. మహిళలకు విలువను నిర్ణయించడం వారి సమస్య కాదని ఆయన అన్నారు.

టోల్ ప్లాజా వద్ద కారు బీభత్సం..ఆగి ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం.. ఆరుగురికి గాయాలు

‘‘మహిళలకు విలువ ఇవ్వడం ప్రధానంగా పురుషుల సమస్య. కాబట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముందు మన మైండ్ సెట్ ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను’’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. న్యాయాన్ని ప్రజల ముంగిటకు తీసుకెళ్లడమే ఎన్సీడబ్ల్యూ, నల్సా చేస్తున్న పని అసలు విలువ అని తెలిపారు. సాంకేతికత అపరిమితమైన అవకాశాలను, కొత్త సౌకర్యాలను, ప్రజల హక్కుల సాధనకు అవకాశాలను తెరుస్తోందని ఆయన అన్నారు.

ఘోరం.. ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు మృతి, 25 మందికి గాయాలు..

సాంకేతిక పరిజ్ఞానం పారదర్శకతను అందిస్తుందని, జరిగే ప్రతి విషయాన్ని సమగ్రంగా రికార్డు చేస్తుందని, వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటే కులం, వర్గం, మతం, లింగం లేదా సమాజంలోని వివిధ హోదాల ఆధారంగా వ్యవస్థలోని అసమానతలను విస్మరించలేమని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. న్యాయం అవసరమైన ప్రజలకు వారి హక్కులపై అవగాహన కల్పించడం ద్వారా నల్సా, ఎన్సీడబ్ల్యూ చేసిన కృషి న్యాయం అందించిందని సీజేఐ అన్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్