
The Kashmir Files: కేంద్ర ప్రభుత్వం "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి CRPF 'వై' కేటగిరీ భద్రతను కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. దేశంలో ఎక్కడికి ఆయన వెళ్లిన వై కేటగిరి భద్రత ఉంటుందని పేర్కొన్నాయి. 1990ల్లో కాశ్మీర్ పండిట్లపై జరిగిన అకృత్యాలు, హత్యాకాండలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా పలువురి నుంచి ప్రశంసలను అందుకుంటోంది. సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే,, మార్చి 11న సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాల్లో చిక్కుకుంది. బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు దానిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.
మంగళవారం నాడు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల విడుదలైన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రానికి తన మద్దతును తెలియజేసారు, ప్రయత్నాలకు వ్యతిరేకంగా, దానిని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సరైన పద్ధతిలో సత్యాన్ని బయటకు తీసుకురావాలని, ప్రధాని ఎల్లప్పుడూ దేశానికి అనుకూలంగా ఉంటారని అన్నారు. మరోవైపు, ఈ చిత్రం సగం సత్యం మాత్రమే చూపించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రానికి మద్దతు ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ నాయకులపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు మరియు కాశ్మీర్పై 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా తీయగలిగితే, 'లఖింపూర్ ఫైల్స్' కూడా తీయవచ్చు అని అన్నారు. బీజేపీ నాయకుడు, కేంద్ర్ మంత్రి కాన్వాయ్ ని రైతులపైకి పోనించిన ఘటనను గుర్తు చేశారు. అలాగే, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ మాట్లాడుతూ 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం అర్ధసత్యాలను చూపుతుందని, కాశ్మీర్లో హిందువులే కాదు, బౌద్ధులు, ముస్లింలు, సిక్కులు కూడా హత్యకు గురయ్యారని అన్నారు.
మార్చి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు. ఇది 1990లో జరిగిన కాశ్మీరీ పండిట్ల మారణహోమం చుట్టూ తిరుగుతుంది. కాగా, 'తాష్కెంట్ ఫైల్స్', 'హేట్ స్టోరీ' మరియు 'బుడ్డా ఇన్ ఎ ట్రాఫిక్ జామ్' వంటి చిత్రాలకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రంపై వస్తున్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఆయన వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్టు సమాచారం. ప్రస్తుతం "ది కాశ్మీర్ ఫైల్స్" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.