కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది..అందుకే సంస్థలపై విమర్శలు - జేపీ నడ్డా

Published : Mar 21, 2024, 02:05 PM IST
కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది..అందుకే సంస్థలపై విమర్శలు - జేపీ నడ్డా

సారాంశం

కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆ పార్టీ జీపు నుంచి హెలికాప్టర్ల వరకు స్కామ్ లకు పాల్పడిందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. ఆ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారని అన్నారు. ఆ పార్టీకి చారిత్రాత్మక ఓటమి భయం పట్టుకుందని అన్నారు. అందుకే ఆ పార్టీ నాయకులు మీడియాతో భారత ప్రజాస్వామ్యం, సంస్థలపై విరుచుకుపడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు. కాంగ్రెస్ తన అసమర్థతను ‘ఆర్థిక ఇబ్బందులు’ అంటూ సౌకర్యవంతంగా నిందిస్తోందని అన్నారు. కానీ వాస్తవానికి వారు ఆర్థికంగా దివాలా తీయలేదని, నైతికంగా, మేధోపరంగా దివాలా తీశారని అన్నారు. 

కాంగ్రెస్ తమ తప్పులను సరిదిద్దుకోవడానికి బదులుగా, వారి ఇబ్బందులకు అధికారులను నిందిస్తోందని జేపీ నడ్డా ఆరోపించారు. ఐటీఏటీ లేదా ఢిల్లీ హైకోర్టు అయినా నిబంధనలకు లోబడి ఉండాలని, పన్నులు చెల్లించాలని కాంగ్రెస్ ను కోరాయి. కానీ ఆ పార్టీ ఎప్పుడూ అలా చేయలేదని అన్నారు. 

ప్రతి రంగాన్ని, ప్రతి రాష్ట్రాన్ని, చరిత్రలోని ప్రతి క్షణాన్ని దోచుకున్న పార్టీకి ఆర్థిక నిస్సహాయత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని జేపీ నడ్డా విమర్శించారు. జీపు నుంచి హెలికాప్టర్ల వరకు అన్ని కుంభకోణాల నుంచి కూడబెట్టిన సొమ్మును బోఫోర్స్ ద్వారా కాంగ్రెస్ తమ ఎన్నికల ప్రచారానికి వాడుకోవచ్చని అన్నారు. 

భారతదేశం ప్రజాస్వామ్య దేశమని కాంగ్రెస్ పార్ట్ టైమ్ నాయకులు అంటున్నారని ఆయన విమర్శించారు. 1975 నుంచి 1977 మధ్య కొన్ని నెలల పాటు మాత్రమే భారతదేశం ప్రజాస్వామ్యం కాదని అన్నారు. ఆ సమయంలో భారత ప్రధాని మరెవరో కాదని, ఇందిరాగాంధీ అని వినమ్రంగా వారికి గుర్తు చేస్తున్నానని పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu
Indian Army : సైన్యం కోసం ఇండియా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?