దసరా నవరాత్రుల ముగింపు సందర్భంగా హర్యానాలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి.
హర్యానాలో యమునా నగర్ లో నిర్వహించిన రావణ దహనంలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం రాత్రి సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంటలతో ఉన్న దిష్టిబొమ్మ అనూహ్యంగా నేలపై పడింది. ఒక్క సారిగా జరిగిన ఈ ఘటన వల్ల పలువురికి గాయాలయ్యాయి.
దసరా సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో రావణ దహనం నిర్వహిస్తుంటారు. యమునానగర్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఆ దిష్టిబొమ్మ సగం కాలిన తరువాత ఒక్క సారిగా కింద పడింది. దీంతో అక్కడున్న జనం ఒక్క సారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక పరుగులు తీశారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్గా మహిళను నియమిస్తారా?: మోహన్ భగవత్ ను నిలదీసిన దిగ్విజయ్సింగ్
ఈ ప్రమాదంలో అక్కడే రావణ దహనాన్ని చూస్తున్న పలువురికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా దసరా పండుగను జరుపుకున్నారు.
| Haryana: A major accident was averted during Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people gathered. Some people were injured. Further details awaited pic.twitter.com/ISk8k1YWkH
— ANI (@ANI)విజయదశమి రోజున తొమ్మిది రోజుల పాటు సాగిన నవరాత్రి ముగింపునకు రావడంతో, లేహ్, లూధియానా, డెహ్రాడూన్, పాట్నా, అమృత్ సర్ తో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని ప్రజలు రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేశారు.