Raipur: భారత్ జోడో యాత్రపై భారతీయ జనతా పార్టీ అసత్యాలు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర తర్వాత జరగనున్న కాంగ్రెస్ తొలి భారీ సమావేశం గేమ్ ఛేంజర్ అవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.
Congress General Secretary KC Venugapal: భారత్ జోడో యాత్రకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ చేపట్టిన దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను అతిపెద్ద రాజకీయ ఉద్యమంగా వేణుగోపాల్ అభివర్ణించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో వేణుగోపాల్ మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న పార్టీ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన వచ్చినట్టు తెలిపారు. అలాగే, “భారత్ జోడో యాత్ర గురించి వారు (బీజేపీ) ఏమి మాట్లాడినా, అది ఎలా జరిగిందో మీరు చూశారు. ఇది దేశంలోని అతిపెద్ద రాజకీయ ఉద్యమాలలో ఒకటిగా మారింది. వారు (బీజేపీ) అసత్య ప్రచారం చేస్తోంది" అని అయన అన్నారు. రాయ్పూర్లో జరిగే ప్లీనరీ సమావేశానికి సంబంధించి మాట్లాడుతూ.. ఇది భారత రాజకీయాలకు గేమ్ ఛేంజర్గా రుజువు చేస్తుందని పేర్కొన్నారు.
We have our plenary on 24, 25, and 26 February. I am here to see the preparations for the Plenary. After that, there will be a preparatory meeting. I will leave after that: Congress general secretary KC Venugopal, in Raipur, Chhattisgarh pic.twitter.com/gOR45xOH7Z
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ)కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశం..
భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరుగుతోంది. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు రాయ్పూర్లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఆర్గనైజింగ్, రిసెప్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తారిఖ్ అన్వర్ నియమితులయ్యారు. దీనికి సంబంధించి రాయ్పూర్ చేరుకున్న వేణుగోపాల్ అక్కడ ప్రాథమిక సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో మా ప్లీనరీ సమావేశం జరగనుందనీ, ప్లీనరీ సన్నాహాలను చూసేందుకే ఇక్కడికి వచ్చానని, ఆ తర్వాత సన్నాహకాలకు సంబంధించి సమావేశం ఉంటుందని చెప్పారు. సమావేశం అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరనున్నట్టు తెలిపారు.
భారత్ జోడో యాత్ర జనవరి 30న ముగిసింది..
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారి నుండి దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. 135 రోజుల తర్వాత, డిసెంబర్ 29, 2023న కాశ్మీర్లోని లాల్ చౌక్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడంతో ప్రయాణం పూర్తయింది. ఈ సమయంలో భారత్ జోడో యాత్ర 14 రాష్ట్రాల్లోని 75 జిల్లాల గుండా వెళ్ళింది. ఈ కాలంలో రాహుల్తో పాటు కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు 204 మంది భారతీయ ప్రయాణికులు వెళ్లారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ 13 ర్యాలీల్లో ప్రసంగించారు.