ఎయిర్ ఇండియా విమానం హైజాక్.. ఉగ్రవాదుల కుట్ర

By ramya neerukondaFirst Published Nov 7, 2018, 11:15 AM IST
Highlights

ఎయిర్ ఇండియా విమానం హైజాక్ చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు.

 ఎయిర్ ఇండియా విమానం హైజాక్ చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. కాగా.. ఉగ్రవాదుల కుట్రను నిఘా వర్గాలు భగ్నం చేశాయి.కాబూల్‌లో ఎయిరిండియా విమానాన్ని హైజాక్‌ చేసి దేశంలోనే ఏదో ఒక విమానాశ్రయంలో దింపడానికి ఉగ్రవాదుల పథకాన్ని గుర్తించిన నిఘా వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. 

దీంతో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో యాంటీ హైజాకింగ్‌ బృందాలను మోహరించారు. అటు శంషాబాద్‌ విమానాశ్రయంలోనూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో భారీ భద్రతా బలగాలను మోహరించారు.

click me!