యువతిపై మాంత్రికుడు అత్యాచారం..!

Published : Mar 25, 2022, 12:56 PM ISTUpdated : Mar 25, 2022, 01:02 PM IST
 యువతిపై మాంత్రికుడు అత్యాచారం..!

సారాంశం

ఆ సమయంలో యువతి ఒక్కతో ఇంట్లో ఉంది. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని.. నిందితుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు

22ఏళ్ల యువతిని మాయ చేసి ఓ మాంత్రికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి శరీరంలో చెడు ఆత్మ ఉందని.. దానిని తొలగిస్తానని నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడటం గమనార్హం.  ఈ సంఘటన అజ్మీర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఘటనలో నిందితుడిని రాజేంద్ర కుమార్ వాల్మీకి(49) గా పోలీసులు గుర్తించారు. నిందితుడు ఢిల్లీకి చెందినవాడిగా గుర్తించారు. కాగా.. బాధితురాలి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఏదో వివాహానికి హాజరయ్యారు. కాగా... ఆ సమయంలో యువతి ఒక్కతో ఇంట్లో ఉంది. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని.. నిందితుడు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు

కాగా.. ఇలా పలుమార్లు బాధితురాలిపై నిందితుడు.. తనలోని చడెు ఆత్మను నాశనం చేస్తానంటూ నమ్మించి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  నిందుతుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Femina Miss India ఫెమినా మిస్ ఇండియా 2026 విజేతగా గోవా బ్యూటీ సాధ్వి సతీష్ సైల్| Asianet News Telugu
Summer Trip : అందమైన దీవులు, చల్లచల్లని బీచ్ లు.. సమ్మర్ ట్రిప్ కు పర్పెక్ట్ డెస్టినేషన్..!