లింగ మార్పిడి చేస్తానని మహిళను చంపేసిన తాంత్రికుడు.. యూపీలో దుర్ఘటన

Published : Jun 21, 2023, 01:33 PM IST
లింగ మార్పిడి చేస్తానని మహిళను చంపేసిన తాంత్రికుడు.. యూపీలో దుర్ఘటన

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు యువతులు స్నేహంగా దగ్గరై ఆ తర్వాత శారీరక సంబంధం పెట్టుకున్నారు. దీంతో అందులో ఒకరు ఆమెను పెళ్లి చేసుకోవాలని లింగ మార్పిడి చేసుకోవాలని అనుకుంది. కానీ, మరొక యువతి మాత్రం పురుషుడితో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆమెనే ఓ తాంత్రికుడిని కలిసి తన భాగస్వామిని హత్య చేసే కుట్ర పన్నింది.  

Gender: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. లింగ మార్పిడి చేస్తానని ఓ మహిళను అడవిలోకి తీసుకెళ్లి ఓ తాంత్రికుడు క్రూరంగా దాడి చేశాడు. మరో మహిళను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె లింగ మార్పిడి చేసుకోవాలని అనుకుంది. ఈ ఘటన షాజహాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకున్నట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు.

ఎస్పీ ఎస్ ఆనంద్ పీటీఐకి కీలక వివరాలు వెల్లడించారు. ఆర్సీ మిషన్ పోలీసు స్టేషన్ ఏరియా నివాసి 30 ఏళ్ల ప్రియా, పువాయన్ నివాసి 24 ఏళ్ల ప్రీతిలు స్నేహం చేశారు. ఆ స్నేహం వారి మధ్య శారీరక సంబంధానికి దారి వేసింది. వారు సేమ్ సెక్స్ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ప్రీతి తన దారి తాను చూసుకోవాలని అనుకుంది. వేరే పురుషుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

కానీ, ప్రియాతో ఉన్న సంబంధం కారణంగా ప్రీతికి సంబంధాలు రాలేవు. వచ్చిన సెట్ కాలేవు. 

ప్రీతి, ఆమె తల్లి ఉర్మిలా ఓ తాంత్రికుడు, మొహమ్మది ఏరియాకు చెందిన రామ్ నివాస్‌ను కలిశారు. వీరంతా కలిసి ప్రియను చంపేయడానికి ప్లాన్ చేశారు. అదే సమయంలో ప్రియా లింగ మార్పిడి చేసుకుని పురుషుడిగా మారాలని అనుకుంటున్నట్టు ప్రీతి ఆ తాంత్రికుడికి చెప్పింది. ఈ విషయాన్ని వారు అదునుగా తీసుకున్నారు. ప్రియను చంపేస్తే రూ. 1.5 లక్షలు చెల్లిస్తామని ప్రీతి తల్లి తాంత్రికుడికి హామీ ఇచ్చింది.

Also Read: ‘నా మీదికి ఆత్మ వస్తుంది, భయపడకుంటే నీ అప్పులు తీరిపోతాయి’.. మైనర్ బాలికపై రేప్.. ముగ్గురు అరెస్ట్

వీరు అనుకున్నట్టుగానే.. ప్రియాకు ప్రీతి ఫోన్ చేసింది. తాంత్రిక్ ఆమె లింగ మార్పిడి చేయగలడని నమ్మించింది. 

ప్రియా ఏప్రిల్ 13వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చింది. అప్పటి నుంచి మళ్లీ కనిపించలేదు. ఏప్రిల్ 18వ తేదీన ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సర్వెలెన్స్ ఆధారంగా ప్రియా ప్రీతితో, తాంత్రికుడు రామ్ నివాస్‌తో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు.

వాటి ఆధారంగా రామ్ నివాస్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించగా.. తానే ఆమెను చంపేసినట్టు అంగీకరించాడు. ప్రియను అడవిలోకి తీసుకెళ్లి లింగ మార్పిడి చేస్తానని నమ్మబలికానని వివరించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత నేలపై పడుకోమని, కళ్లు మూసుకోమని చెప్పగా ప్రియా అలాగే చేసిందని తెలిపాడు. అప్పుడే ఓ సుత్తె తీసుకుని గొంతుపై వేటు వేశానని వివరించాడు.

తాంత్రిక్, ప్రీతిలను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి జైలుకు పంపించారు. తాంత్రికుడి ఇంటిలో ఆ సుత్తెను పోలీసులు రికవరీ చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్