జ్యోతిష్కుడి మాట విన్నాడు.. పాము కాటుతో నాలుక పోగొట్టుకున్నాడు

Published : Nov 26, 2022, 01:53 PM IST
జ్యోతిష్కుడి మాట విన్నాడు.. పాము కాటుతో నాలుక పోగొట్టుకున్నాడు

సారాంశం

తమిళనాడులో ఓ రైతు జ్యోతిష్కుడి మాటలు విని ఉన్న నాలుకను పోగొట్టుకున్నాడు. తరచూ పాము కలలు వస్తున్నాయని, ఆ కలల్లో పాములు తనను కాటేస్తున్నాయని రైతు రాజా జ్యోతిష్కుడికి తెలిపాడు. దీనికి జ్యోతిష్కుడు ఇచ్చిన సలహా వినడంతో ఆ రైతు నాలుకపై పాము కాటు వేసింది.  

చెన్నై: తమిళనాడులో ఓ జ్యోతిష్కుడి సలహా ఓ రైతుకు ప్రమాదకరంగా మారింది. ప్రాణాలకే ముప్పు తెచ్చింది. నాలుక పై పాము కాటేసేలా చేశాయి. చివరకు ఆ వ్యక్తి తన నాలుకనూ కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన తమిళనడులోని ఎరోడ్‌లో చోటుచేసుకుంది.

కొపిచెట్టిపాలయంకు చెందిన 54 ఏళ్ల రాజా కలలోకి తరుచూ పాములు వస్తున్నాయి. ఆ కలల్లో అతను పాము కాటుకు గురవుతున్నాడు. ఈ వ్యవహారంపై కలవరం చెందిన రాజా ఇందుకు పరిష్కారం కోసం ప్రయత్నించాడు. ఇందులో భాగంగా ఓ జ్యోతిష్కుడిని కలిశాడు. ఆ జ్యోతిష్కుడు డెడ్లీ సజేషన్ ఇచ్చాడు.

ఈ పాము కలల నుంచి తప్పించుకోవాలంటే రాజాను ఓ సర్ప ఆలయా నికి వెళ్లాలని జ్యోతిష్కుడు సూచించాడు. అక్కడ కొన్ని పూజలు చేయాలని సూచనలు చేశాడు. జ్యోతిష్కుడి సలహా మేరకు ఆ రైతు సర్ప ఆలయా నికి వెళ్లాడు.అక్కడ పూజ తంతు ముగించుకున్నాడు. ఆ తర్వాత చివరిలో అక్కడే ఉన్న రస్సెల్ వైపర్ ముందు మూడు సార్లు నాలుక తెరిచి ఉంచాడు. మూడు సార్లు నాలుక తీసి ఆ పాము ముందు ఉంచి వెనక్కి తీసుకోవాలని జ్యోతిష్కుడు చెప్పాడు. రాజా ఆ సూచనలనే ఫాలో అయ్యాడు. కానీ, రాజా నాలుకను చూసి రస్సెల్ వైపర్ యాక్టివ్ అయింది. లిప్తకాలంలోనే ఆ వ్యక్తి నాలుకను రస్సెల్ వైపర్ కాటేసింది.

Also Read: పామును ముద్దాడబోతే... కసిదీరా పెదవులపై కాటేసింది.. చికిత్స తీసుకుంటూ....

ఆ ఆలయ పూజారి ఈ ఘటన చూడగానే వెంటనే రెస్పాండ్ అయ్యాడు. ఆ వ్యక్తి నాలుకను కట్ చేశాడు. వెంటనే ఆయనను ఎరోడ్ మేనియర్ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడే ఆ వ్యక్తికి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్లుతుండగా ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. 

మేనియన్ మెడికల్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ సెంథిల్ కుమారన్ మాట్లాడుతూ, తెగిపోయిన రాజా నాలుకకు వైద్యులు చికిత్స చేశారని వివరించారు. పాము విషానికి విరుగుడునూ ఆయనకు ఇచ్చినట్టు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!
Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు | Asianet News Telugu