Tamilnadu Accident : ఎన్నోర్ థర్మల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Tamilnadu Accident : తమిళనాడులోని ఎన్నోర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణపనుల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న స్టీల్ ఆర్చ్ కూలిపోవడంతో తొమ్మిది మంది కార్మికులు మరణించారు… అనేకమంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయం 'X'లో ఒక పోస్ట్ చేసింది. "తమిళనాడులో ఓ నిర్మాణం కూలిపోవడం వల్ల జరిగిన దుర్ఘటన బాధ కలిగించింది. ఈ కష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తాం. గాయపడిన వారికి రూ. 50,000 ఇస్తాం" అని ప్రకటించారు.
<br><strong>అస్సాం, చుట్టుపక్కల ప్రాంతాల కార్మికులు</strong></h2><p>తమిళనాడులోని ఎన్నోర్ థర్మల్ పవర్ నిర్మాణ స్థలంలో ఘోర ప్రమాదం జరిగింది. స్టీల్ ఆర్చ్ కూలిపోవడంతో తొమ్మిది మంది కార్మికులు మరణించారు.తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (TANGEDCO) ఛైర్మన్ డాక్టర్ జె. రాధాకృష్ణన్ ప్రకారం… ఈ కార్మికులు అస్సాం, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు. బీహెచ్ఈఎల్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. </p><p>పోలీసు అధికారుల ప్రకారం.. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు, అధికారులు దీనిపై మరింత దర్యాప్తు చేస్తున్నారు. "ఈ ఘటనలో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను నార్త్ చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు," అని ఆవడి పోలీస్ కమిషనరేట్ తెలిపింది.</p><div type="dfp" position=3>Ad3</div><p> </p>