మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్.. నెలవారీ ₹ 1,000 సహాయం అందించే పథకం ప్రారంభం

Published : Jul 24, 2023, 01:37 PM IST
మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్.. నెలవారీ ₹ 1,000 సహాయం అందించే పథకం ప్రారంభం

సారాంశం

Chennai: మహిళలకు నెలకు రూ.1,000 సాయం అందించే పథకాన్ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్రారంభించ‌నుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై జయంతి రోజైన సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని దాదాపు కోటి మంది మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.  

Rs 1,000 monthly aid to women heads: మహిళలకు నెలకు రూ.1,000 సాయం అందించే పథకాన్ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్రారంభించ‌నుంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై జయంతి రోజైన సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని దాదాపు కోటి మంది మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. త‌మిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమ‌వారం మహిళలకు నెలవారీ ₹ 1,000 సహాయం అందించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార డీఎంకే ప్రధాన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ పథకం రాష్ట్రంలోని దాదాపు 1 కోటి మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తుంది. డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై జన్మదినమైన సెప్టెంబర్ 15 నుండి అమలు చేయబడుతుంది. ఈ ఏడాది ఈ ప‌థ‌కం కసరత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹ 7,000 కోట్లు కేటాయించింది.

ధ‌ర్మపురి జిల్లాలో ప్రత్యేక రిజిస్ట్రేషన్ శిబిరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ మహిళల జీవితకాల నిస్వార్థ కృషికి ఇది గుర్తింపు అని అన్నారు. కోట్లాది మంది మహిళల జీవితాల్లో, కుటుంబాల్లో పునరుజ్జీవనం వస్తుందనీ, పేదరికాన్ని నిర్మూలిస్తామ‌ని తెలిపారు. మహిళలు ఆత్మగౌరవంతో జీవించడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ పథకం మహిళా కుటుంబ పెద్దలకు ప్రయోజనం చేకూరుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మహిళలను గుర్తించడానికి ప్రమాణాల జాబితాను ఇస్తుందని ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

ప్రభుత్వం స్థూలంగా మహిళా వీధి వ్యాపారులు, మత్స్యకారులు, నిర్మాణ రంగంలో ఉన్నవారు, ఒకటి కంటే ఎక్కువ ఇళ్లలో ఇంటి సహాయకులుగా పనిచేస్తూ తక్కువ ఆదాయం పొందుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, సంవత్సరానికి రూ .2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదించే కుటుంబాల్లోని మహిళలు, సంవత్సరానికి 3,600 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారు, నాలుగు చక్రాల వాహనాన్ని కలిగి ఉన్నవారిని మినహాయించింది. 5 ఎకరాల లోపు చిత్తడి నేల లేదా 10 ఎకరాల మెట్ట భూమి ఉన్న కుటుంబాలు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్ర‌భుత్వం పేర్కొంది.

ఈ పథకం మొదట నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఆలోచన. డీఎంకే తన మేనిఫెస్టోను విడుదల చేయడానికి ముందు 2021 లో తన పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆయన దీనిని ప్రకటించారు. కాగా, ఈ ప‌థ‌కం సాయాన్ని కుటుంబ పెద్దలందరికీ చెల్లించకపోవడంపై ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!