
జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లా హీరానగర్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడి మృతదేహం అనుమానాస్పద పరిస్థితులలో చెట్టుకు వేలాడుతూ మంగళవారం కనిపించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం చనిపోయిన బీజేపీ నేత సోమ్ రాజ్ మూడు రోజుల కిందట నుంచి కనిపించకుండా పోయారు.
బీహార్ నితీష్ కుమార్ ప్రభుత్వానికి నేడు బలపరీక్ష..
అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు సిట్ ను ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం నలుగురు వైద్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేశారు. విచారణ కొనసాగుతోందని కథువా ఎస్ఎస్పీ ఆర్సి కొత్వాల్ తెలిపారు. మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కతువాలోని హీరానగర్లోని తన ఇంటికి సమీపంలో ఉన్న చెట్టుకు సోమ్ రాజ్ మృతదేహం వేలాడుతూ కనిపించిందని ఓ గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి, పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. శరీరంపై రక్తపు ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు.
సోమ్ రాజు ను ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో సోమ్ రాజ్ ఇంటికి చేరుకున్న పలువురు బీజేపీ నేతలు ఆయన మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే మృతుడి కుటుంభ సభ్యులు తమకు కూడా ప్రాణహాని ఉందని భయపడుతున్నారు.