కృష్ణ జన్మభూమి సమీపంలో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ.. స్టే విధించిన సుప్రీం కోర్టు..

Published : Aug 16, 2023, 03:03 PM IST
కృష్ణ జన్మభూమి సమీపంలో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ.. స్టే విధించిన సుప్రీం కోర్టు..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని కృష్ణ జన్మభూమి సమీపంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు రైల్వే అధికారులు చేపట్టిన కూల్చివేత కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు 10 రోజుల పాటు నిలిపివేసింది. 

ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని కృష్ణ జన్మభూమి సమీపంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు రైల్వే అధికారులు చేపట్టిన కూల్చివేత కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు 10 రోజుల పాటు నిలిపివేసింది. అక్కడ యథాతథ స్థితిని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై కేంద్రంతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా.. ‘‘రాబోయే 10 రోజుల పాటు, సబ్జెక్ట్ ప్రాంగణానికి సంబంధించి యథాతథ స్థితి ఉండనివ్వండి. ఈ విషయం ఒక వారం తర్వాత తదుపరి పరిశీలన కోసం జాబితా చేయబడుతుంది’’ అని ధర్మాసనం  పేర్కొంది. 

ఇక, విచారణ సందర్భంగా ఇప్పటికే 100 ఇళ్లు కూల్చివేయబడ్డాయని, దాదాపు 70 నుంచి 80 ఇళ్లు ఇంకా చెక్కుచెదరలేదని పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన యాకూబ్ షా ధర్మాసనానికి తెలిపారు. మరిన్ని కూల్చివేతలు జరిగితే మొత్తం పరిస్థితి అసంబద్ధంగా మారే అవకాశం ఉందని,..ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని కోర్టులు పనిచేయని రోజున ఈ చర్యలు జరిగాయని అన్నారు. 

ఈ కేసు విషయానికి వస్తే.. కృష్ణ జన్మభూమి సమీపంలోని నివాసాల కూల్చివేతకు సంబంధించిన అంశం. అంతకుముందు ఆగస్టు 14న.. రైల్వే కూల్చివేత డ్రైవ్‌లో ప్రభావితమైన వారు ఈ చర్యను సవాలు చేయడానికి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ‘‘అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తరలించడానికి మేము మీకు స్వేచ్ఛ ఇస్తాం. దయచేసి హైకోర్టును ఆశ్రయించండి’’ అని  పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu