చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సునీల్ అరోరా

Published : Dec 02, 2018, 01:48 PM IST
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సునీల్ అరోరా

సారాంశం

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా సునీల్‌ అరోరా ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 2తో ఓపీ రావత్ పదవీ కాలం ముగుస్తుండటంతో నవంబర్ 26న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అరోరాను సీఈసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఓపీ రావత్‌ పదవీ విరమణ చేసిన వెంటనే ఆయన స్ధానంలో అరోరా ఈసీ పగ్గాలు చేపట్టారు.   

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా సునీల్‌ అరోరా ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 2తో ఓపీ రావత్ పదవీ కాలం ముగుస్తుండటంతో నవంబర్ 26న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అరోరాను సీఈసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఓపీ రావత్‌ పదవీ విరమణ చేసిన వెంటనే ఆయన స్ధానంలో అరోరా ఈసీ పగ్గాలు చేపట్టారు.   

మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన సునీల్ అరోరా గతేడాది సెప్టెంబర్‌ నెలలో ఎన్నికల సంఘం అధికారిగా నియమితులయ్యారు. గతంలో ఆయన సమాచార, ప్రసారాల శాఖ, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శిగానూ విధులు నిర్వహించారు. 

సునీల్ అరోరా 1980 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి. గతంలో ఆయన ఆర్థికమంత్రిత్వ శాఖ, టెక్స్‌టైల్‌, ప్రణాళికా కమిషన్‌ శాఖల్లోనూ పనిచేశారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా 1999- 2000 మధ్య కాలంలో పనిచేశారు. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సీఎండీగానూ సేవలందించారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమినర్ గా నియమితులయ్యారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !