
బొంబాయి : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి (IIT-B)లో 18 ఏళ్ల విద్యార్థి ఆదివారం మధ్యాహ్నం ఇన్స్టిట్యూట్ క్యాంపస్లోని తన హాస్టల్ భవనంలోని ఏడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థి అహ్మదాబాద్కు చెందినవాడని, పొవాయ్లోని ఐఐటీలో బీటెక్ చదువుతున్నాడని తెలిపారు. విద్యార్థి మూడు నెలల క్రితమే కోర్సులో చేరాడు. అతని మొదటి సెమిస్టర్ పరీక్షలు శనివారంతో ముగిశాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్యాంపస్కు చేరుకుని విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపామని, గుజరాత్లోని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోవై పోలీస్ స్టేషన్లోని ఒక అధికారి తెలిపారు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు.. ఘటన స్థలంలో 27 ఫైరింజన్లు..
పోవై పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా ఏడీఆర్ నమోదు చేశారు. చదువుల ఒత్తిడి వల్లే విద్యార్థి ఈ దారుణానికి ఒడిగట్టిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ జరుగుతోంది.