తండ్రి పెదాలను తాడుతో కుట్టేసి, చేతులు కాళ్లు కట్టేసి.. హత్యాయత్నం..!

By AN TeluguFirst Published Jul 15, 2021, 11:50 AM IST
Highlights

పాలము జిల్లాలోని అంటారి రోడ్ బ్లాక్ లోని భీతిహార గ్రామంలో భోలారామ్ అనే వృద్ధుడి మొదటి భార్య చనిపోగా 2010లో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సవతి తండ్రిమీద రెండో భార్య కొడుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు.

జార్ఖండ్ రాష్ట్రంలో అమానుష ఘటన వెలుగు చూసింది.  65 ఏళ్ల వృద్ధుడు పెదాలను తాడుతో కుట్టి, చేతులు, కాళ్లను రైల్వే ట్రాక్ కు  కట్టి దాష్టీకానికి  పాల్పడ్డాడు సవతి కొడుకు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు రైల్వే ట్రాక్ నుంచి వృద్ధుడిని రక్షించారు.

పాలము జిల్లాలోని అంటారి రోడ్ బ్లాక్ లోని భీతిహార గ్రామంలో భోలారామ్ అనే వృద్ధుడి మొదటి భార్య చనిపోగా 2010లో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సవతి తండ్రిమీద రెండో భార్య కొడుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోలారామ్ మూత్రవిసర్జనకు బయటకు వెళ్ళగా అదే సమయంలో కొడుకు మరో ఇద్దరితో కలిసి వృద్ధ తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు తండ్రి పెదాలను తాడుతో కుట్టి,  చేతులు, కాళ్లను కట్టి సమీపంలోని రైల్వే ట్రాక్ కు తీసుకుని వెళ్లారు.

రాత్రి 11 గంటల సమయంలో భోలారామ్ ను రైల్వే ట్రాక్ మీద కట్టేసి వారందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయాన్నే గ్రామస్తులు ట్రాక్ పై కట్టిపడేసిన వ్యక్తిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

అక్కడికి చేరుకున్న పోలీసులు వృద్ధుడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.   అక్కడ చికిత్స పొందు పొందుతున్న వృద్ధుడి పెదాలను కలిపి కొట్టడానికి ఉపయోగించిన తాడును వైద్యులు తొలగించారు.

ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనలో రెండవభార్య హస్తం కూడా ఉందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు
 

click me!