
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన ఇటీవలి రాజకీయ సంక్షోభానికి సంబంధించి దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు బుధవారం ఆగస్టు 1కి వాయిదా వేసింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శిబిరానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం కొంత సమయం ఇచ్చింది.
పిటిషన్లలోని కొన్ని అంశాలపై ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ సూచించాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ‘‘ కొన్ని సమస్యలకు విస్తృత బెంచ్ అవసరం కావచ్చునని నేను బలంగా భావిస్తున్నాను. విస్తృత ధర్మాసనం ఈ కేసును విచారించగలదు ’’ అని ఆయన అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ యథాతథ స్థితిని కొనసాగిస్తారని, అనర్హత పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోరని ఆయన అన్నారు. అన్ని రికార్డులను సురక్షితమైన కస్టడీలో ఉంచాలని సుప్రీం కోర్టు శాసనసభ కార్యదర్శికి తెలిపింది.
Former Athlete PT Usha: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన లెజెండరీ ప్లేయర్ పిటి ఉష ..
కాగా.. ఈ కేసును ఆమోదించగలిగితే దేశంలో ఎన్నికైన ప్రతి ప్రభుత్వాన్ని కూలదోయవచ్చని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే క్యాంప్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. పదో షెడ్యుల్ లో ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టగలిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ ప్రజల తీర్పునకు అర్థం ఏముంది ? పదో షెడ్యూల్ను అత్యద్భుతంగా మార్చారు. ఫిరాయింపులను ప్రేరేపించడానికి ఉపయోగించారు ’’ అని సిబల్ అన్నారు.
సుప్రీంకోర్టు కేసులో విచారణలో ఉన్నప్పుడు షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ ప్రమాణం చేయించి ఉండకూడదని ఆయన ధర్మాసనానికి తెలిపారు. పార్టీ నామినేట్ చేసిన అధికారిక విప్ కాకుండా షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటుదారుల కొత్త పార్టీ విప్ ను గుర్తించాలని అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం దుర్మార్గం అని ఆయన అన్నారు.
యోగి కేబినేట్ లో అసంతృప్తి.. ఇద్దరు మంత్రుల రాజీనామా ? నేడు వారితో భేటీ కానున్న అమిత్ షా
ఇదిలా ఉండగా.. షిండే శిబిరం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు గుంపుగా ఏర్పడి ప్రధానిని కూడా దిగిపోవాలని చెప్పవచ్చని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఒక నాయకుడు తన పార్టీలో బలాన్ని కూడగట్టుకుని అందులోనే ఉండి నాయకత్వాన్ని విడిచిపెట్టకుండా ప్రశ్నించినట్లయితే అది ఫిరాయింపు కాదని తెలిపారు. ‘‘ ఓ పార్టీలో పెద్ద సంఖ్యలో నాయకులు తమకు మరో వ్యక్తి నాయకత్వం వహించాలని భావిస్తే అందులో తప్పేముంది ’’ అని ఆయన ప్రశ్నించారు.
తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే తన తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అనంతరం వారు బీజేపీతో చేతులు కలిపారు. దీంతో శివసేనలో చీలిక బయటపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే తన సీఎం పదవికి జూన్ 29వ తేదీన రాజీనామ చేశారు. మరుసటి రోజు షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సీఎంగా, బీజేపీ నుంచి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.