Lok Sabha Exit Polls 2024: 'ఎగ్జిట్ పోల్స్' ఫలితాలపై సోనియాగాంధీ సంచలన వ్యాఖ్యలు.. 

Published : Jun 03, 2024, 05:53 PM IST
Lok Sabha Exit Polls 2024: 'ఎగ్జిట్ పోల్స్' ఫలితాలపై సోనియాగాంధీ సంచలన వ్యాఖ్యలు.. 

సారాంశం

Lok Sabha Exit Polls 2024: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) సంపూర్ణ మెజారిటీతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Lok Sabha Exit Polls 2024: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) సంపూర్ణ మెజారిటీతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలపై దేశ ప్రతిపక్ష కూటమి అసంతృప్తి వ్యక్తం చేసింది. అదంతా పచ్చి అబద్ధమని అభిప్రాయపడింది. మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ స్పందించారు. 

లోక్‌సభ ఎన్నికలు-2024 ఫలితాలకు ఒకరోజు ముందు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో 'భారత్'కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని  ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు వస్తాయనీ, తాము పూర్తి నమ్మకంతో ఉన్నామని ' అన్నారు. జూన్ 4న వెలువడే ఫలితాల కోసం వేచిచూడాలని కోరారు. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న దానికి పూర్తి భిన్నంగా ఎన్నికల ఫలితాలు వస్తాయన్న నమ్మకం తనకు ఉందని, ఇది మోడీ ఊహ అని సోనియా అన్నారు. చాలా ఎగ్జిట్ పోల్స్‌లో బిజెపి కంటే ఎన్‌డిఎనే ఆధిక్యంలో ఉందని అన్నారు.  పార్టీ ఎగ్జిట్ పోల్స్ మానసిక ఒత్తిడిని సృష్టించే మార్గమని, 2004లో అన్ని ఎగ్జిట్ పోల్స్ వాజ్‌పేయి ప్రభుత్వం గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ, ఆనాడు  UPA కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. 'భారత్‌' కూటమికి 295 సీట్లకు పైగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కీలక భేటీ

లోక్‌సభ ఎన్నికలు-2024 ఓట్ల లెక్కింపు సన్నాహాలపై ఆదివారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు, శాసనసభాపక్ష నేతలు, పార్టీ అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ అన్ని ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించారు. ఎగ్జిట్ పోల్స్ గతంలో కూడా ఒకసారి తప్పుగా నిరూపించబడ్డాయి. ఈ తాము కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించామని, భారత కూటమికి 295 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ డిమాండ్  

కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీల సంయుక్త ప్రతినిధి బృందం ఆదివారం నాడు ఎన్నికల కమిషన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు పోస్టల్‌ బ్యాలెట్‌ అంశాన్ని ఎన్నికల సంఘం ముందు ఉంచారు. ఓట్ల లెక్కింపు సమయంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు.  

ఎగ్జిట్ పోల్స్ 

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 371 నుండి 401 స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. దీనిలో బీజేపీకి 319 నుంచి 338 సీట్లు వస్తాయని అంచనా. ఇదే జరిగితే పార్లమెంటులో ఎన్డీఏ దాదాపు మూడు వంతుల మెజారిటీకి చేరుకుంటుందని అంచనా వేసింది.  అలాగే..  ABP వారి  CVoter ఎగ్జిట్ పోల్ ప్రకారం..  NDA కి 353 నుండి 383 సీట్లు వస్తాయని అంచనా. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా పోల్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 379 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌తో కలిసి ఇండియా బ్లాక్ 136 సీట్లు గెలుస్తుందని అంచనా.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

NDA సమావేశంలో చంద్రబాబు పంచ్ లకి పడిపడి నవ్విన మోదీ | NDA Meeting 2026 | Asianet News Telugu
Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu