షాకింగ్... తండ్రిని ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి, భూమిలో పాతిపెట్టి.. ఓ కన్నకొడుకు దారుణం..

By SumaBala BukkaFirst Published May 21, 2022, 8:23 AM IST
Highlights

ఆస్తికోసం దారుణానికి తెగబడ్డాడో కొడుకు.. కన్నతండ్రినే ముక్కలుగా నరికి డ్రమ్ములో కుక్కి.. అందరూ చూస్తుండగానే భూమిలో పాతిపెట్టాడు. చివరికి విషయం వెలుగులోకి రావడంతో....

చెన్నై : property కోసం కన్న కొడుకే తండ్రిని దారుణంగా హతమార్చాడు. dead bodyని ముక్కలు ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములో పడేశాడు. కొత్త పరిశ్రమకు భూమి పూజ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చి, అందరూ చూస్తుండగానే ఆ drumను పాతేశాడు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. చెన్నైలోని వలసరవాక్కం ఆర్కాడుసాలైకు చెందిన కుమార్ రేషన్ (80) కేంద్ర రిటైర్డ్ ఉద్యోగి.  ఆయన భార్య దాక్షాయిణి ఇటీవల మరణించింది. ఆయన కుమారుడు గుణశేఖరన్ (50)తో పాటు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

వీరికి వివాహాలు అయ్యాయి. కుమారుడు గుణశేఖరన్ ఇంట్లో కుమారేశన్ ఉంటున్నాడు. అదే ఇంటిపై అంతస్తులో కుమార్తె కాంచనమాల ఉంటోంది. రెండు రోజులుగా తండ్రి కనిపించకపోవడంతో కాంచనమాల గుణశేఖరన్ భార్య, పిల్లల్ని నిలదీసింది. వారు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించింది. విచారణలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.

కట్టుకథ… 
కుమారేశన్ పేరిట ఉన్న ఇళ్లు, స్థలాలు తన పేరున రాయాలని గుణశేఖరన్ పదేపదే తండ్రిపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అదే సమయంలో గుణశేఖరన్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలకు బలం చేకూరింది. విచారణలో గుణశేఖరన్ హత్య చేసినట్లు తేలింది. కావేరి పాకంలో గుణశేఖరన్ చేపట్టిన టైల్స్ కటింగ్ పరిశ్రమ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో శుక్రవారం పోలీసులు గాలింపు చేపట్టారు.

నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన సమయంలో గుణశేఖరన్  ఒక డ్రమ్మును పాతిపెట్టాడని అక్కడి వారు చెప్పారు. వ్యాపారం బాగా సాగేందుకు మంత్రగాడు ఇచ్చిన కొన్ని వస్తువులు డ్రమ్ములో పెట్టి పూడ్చుతున్నట్లుగా కట్టుకథ చెప్పి నమ్మించాడని తేలింది. పోలీసులు మృతదేహం భాగాలను పోస్టుమార్టంకు తరలించారు. 

ఇలాంటి ఘటనే రెండు రోజుల క్రితం పక్కదేశమైన పాకిస్థాన్ లో వెలుగు చూసింది. తండ్రి కొడుతున్నాడు అన్న కారణంతో ఓ యువకుడు తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేసాడు అంతేకాకుండా కొన్ని శరీర భాగాలకు నిప్పంటించాడు. పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో సూపర్ హైవేపై అఫ్గాన్ బస్తీ వద్ద పోలీసులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహానికి తల, కాళ్లు లేకుండా ఉండడం… శరీర భాగాలను  ముక్కలుగా నరికి బ్యాగ్ లో పడేసి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు గురించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఒక్కొక్కటీ తెలుస్తుంటే షాక్ తో ఒళ్లు జలదరించిపోయి.. వణికిపోయారు. 

సదరు మృతుడిని కన్నకొడుకే తండ్రిని దారుణంగా  కొట్టి హత్య చేశాడని తెలుసుకున్నారు. ఆ తర్వాత మృతదేహం గుర్తు పట్టకుండా ముక్కలుగా నరికినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ముక్కలుగా నరికిన బాడీ పార్ట్స్ కు నిప్పు అంటించినట్లు వెల్లడించాడు. తల, మొండెం లేని శరీరాన్ని గుర్తించడానికి ఫోరెన్సిక్ బృందం చాలా కష్టపడి అతని ఆచూకీ గుర్తించింది. ఈ శరీర భాగాలు పీఐబీ కాలనీకి చెందిన సలీం ఖిల్జీ గా గుర్తించారు. అతడి కొడుకు పై అనుమానం వచ్చి విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నట్లు చెప్పారు.

click me!