Father Rape Daughters: కన్న కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. రాష్ట్ర గవర్నర్, సీఎంకు బాలికల లేఖ

Published : May 21, 2022, 06:34 AM IST
Father Rape Daughters: కన్న కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. రాష్ట్ర గవర్నర్, సీఎంకు బాలికల లేఖ

సారాంశం

Father Rape Daughters: కామంతో  కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి కన్నకూతుళ్లపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. మానవ సంబంధాలకు మచ్చలా నిలిచే ఈ అమానుష ఘ‌ట‌న బీహార్ లోని బక్సర్ జిల్లా రాజ్​పుర్ తాలుకాలో జ‌రిగింది.   

Father Rape Daughters: కామంతో  కళ్లు మూసుకుపోయి..  కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రి త‌న స్వంత‌ కూతుళ్ల పాలిట కామాంధుడుగా మారాడు. ఇలా సభ్యసమాజం తలదించుకునే.. మానవ సంబంధాలకు మచ్చలా నిలిచే ఈ అమానుష ఘ‌ట‌న బీహార్ లో చోటుచేసుకుంది. బాధిత బాలికలు ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రికి లేఖ రాయగా.. విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం..14, 16 ఏండ్ల ఇద్దరు బాలికలు బక్సర్ జిల్లా రాజ్​పుర్ తాలుకాలో ఉంటున్నారు. వీరి తండ్రి ఓ వైద్యుడు. విటమిన్ ట్యాబ్లెట్ల పేరిట ఆ బాలికలకు నిద్రమాత్రలు ఇచ్చేవాడు. అనంతరం తన క్లీనిక్​లోనే అత్యాచారం చేసేవాడు.  తండ్రిని ఎదురిస్తే తీవ్రంగా కొట్టేవాడని బాలికలు తెలిపారు. దీంతో అతడి హింసను తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయారు.

అనంత‌రం.. బక్సర్​లో చిన్న అద్దె ఇంట్లో ఉండసాగారు. అనంతరం, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులకు లేఖ రాశారు. తమపై జరిగిన లైంగిక దాడికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఇదే త‌రుణంలో బుధవారం రాజ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు దరఖాస్తు చేయ‌డానికి వెళ్లిన‌ యువతులిద్దరినీ పోలీసులు మహిళా పోలీసు స్టేషన్‌కు పంపారు. ఈ వ్యవహారంలో ఎస్పీ ఆదేశాల మేరకు మహిళా పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి, అత్త ప్రోద్బలంతో తమ తండ్రి తమ ఇద్దరినీ లైంగికంగా వేధించాడని బాధిత బాలికలు దరఖాస్తులో రాశారని మహిళా ఎస్‌హెచ్‌ఓ కంచన్ కుమారి తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు పోలీసులు. బాలికల తండ్రి, తల్లి, అత్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కొడుకు పుట్టాలన్న ఆశతోనే బాలికల తండ్రి ఇలా తాంత్రికుడితో కలిసి బరితెగించాడని వెల్లడించారు.

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu