రాజస్థాన్‌లో విషాదం.. విషపూరిత పాముకాటుతో ‘స్నేక్ మ్యాన్’ మృతి..

Published : Sep 14, 2022, 10:40 AM IST
రాజస్థాన్‌లో విషాదం.. విషపూరిత పాముకాటుతో ‘స్నేక్ మ్యాన్’ మృతి..

సారాంశం

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఇరవై ఏళ్లుగా పాములను పట్టుకుంటూ పాము మనిషిగా ప్రసిద్ధి చెందిన వినోద్ తివారీ పాముకాటుతో మృతి చెందాడు.

జైపూర్ : రాజస్థాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. చురు జిల్లాలో వినోద్ తివారీ అనే వ్యక్తి దాదాపు గత 20 ఏళ్లుగా పాములను పట్టుకుంటున్నాడు. పాములను పట్టుకున్న తర్వాత వాటిని అడవిలో వదిలి వెళ్లేవాడు. ఈ మేరకు స్థానికులు అతని గురించి చెబుతున్నారు. అయితే, ఈ క్రమంలో శనివారం విషపూరిత నాగుపామును పట్టుకునే సమయంలో దాని కాటుకు గురై తివారీ మృతి చెందాడు. అతని వయసు 45 ఏళ్లు.

ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. శనివారం ఉదయం చురులోని గోగమేడి ప్రాంతంలోని ఓ దుకాణంలోకి వచ్చిన నాగుపామును పట్టుకోవడానికి తివారీ అక్కడికి వచ్చాడు. దుకాణం వెలుపల ఉన్న నాగుపామును పట్టుకుని, దాన్ని సంచిలో వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాము అతని వేలి మీద కాటు వేసింది. ఇదంతా అక్కడి సీసీటీవీ వీడియోలో రికార్డ్ అయ్యింది.  అతను పట్టుకున్న ఆ పాము అత్యంత విషపూరితమైనది కావడంతో.. పాము కాటుకు వేసిన నిమిషాల వ్యవధిలోనే తివారి మృతి చెందాడు.

https://telugu.asianetnews.com/national/maharashtra-four-sadhus-were-attacked-on-suspicion-of-abducting-children--ri6ocq

వినోద్ తివారీ ఆ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా.. సమాచారం అందించగానే వచ్చి.. పట్టుకుని,సమీపంలోని అడవిలో వదిలేసేవాడు. అలా స్తానికులతో బాగా దగ్గరయ్యాడు. అతడిని వారు 'స్నేక్ మ్యాన్'గా పిలిచేవారు. అలా స్థానికంగా ప్రసిద్ధి చెందాడు. ఆదివారం ఆయన అంత్యక్రియలకు పలువురు హాజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu
CM Vijay Speech: సీఎం విజయ్ స్పీచ్ కి దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ | Asianet News Telugu