కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు ఉగ్రవాదులు హతం

By sivanagaprasad kodatiFirst Published Nov 23, 2018, 11:08 AM IST
Highlights

భారీ ఎత్తున ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టిన భారత సైన్యం ఇవాళ జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌లో మరో ఆరుగురు తీవ్రవాదులను అంతం చేసింది. 

భారీ ఎత్తున ఉగ్రవాదుల ఏరివేతకు శ్రీకారం చుట్టిన భారత సైన్యం ఇవాళ జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌లో మరో ఆరుగురు తీవ్రవాదులను అంతం చేసింది. ఈ తెల్లవారుజామున అనంత్‌నాగ్ జిల్లా బిజ్‌భేరా ప్రాంతంలో ముష్కరులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయి.

ఈ నేపథ్యంలో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. కొద్దిరోజుల క్రితం షోపియాన్ జిల్లాలో జిరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. 

click me!