పరువు హత్య: రూ.5 లక్షలిచ్చి అల్లుడిని చంపించిన మామ

By narsimha lodeFirst Published Nov 18, 2019, 1:26 PM IST
Highlights

కర్ణాటక రాష్్రంలో ని హసన్ జిల్లాలో పరువు హత్య చోటు చేసుకొంది. అల్లుడిని రూ,. 5 లక్షలిచ్చి కిరాయి హంతకులతో హత్య చేయించాడు నిందితుడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 


బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో పరువు హత్య కలకలం సృష్టించింది. ఓ మామ అల్లుడిని దారుణంగా హత్య చేయించినట్టుగా పోలీసులు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా హోళెనరసీపుర హేమావతి నదిలో లభించిన మృతదేహం మిస్టరీ వీడింది.

ఈ హత్య కేసును హాసన్‌ పోలీసులు చేధించారు. ఈ హత్యకు పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు  కర్ణాటక రాష్ట్ర పోలీసులు ఈ మేరకు మీడియాకు ఈ సమాచారాన్ని అందించారు. 

కర్ణాటక రాష్ట్రానికి చెందిన  హాసన్‌కు చెందిన మంజునాథ్‌ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన దేవరాజ్‌ కుమార్తెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ వరుసకు అన్నా చెల్లెలు కావడంతో ఈ పెళ్లిని యువతి తండ్రి దేవరాజ్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. 

దీంతో ప్రేమ జంట ఇంటి నుంచిపారిపోయింది. వీరిద్దరూ పెళ్లి చేసుకొని  మాండ్యలో కాపురం పెట్టారు. సెప్టెంబరు 9వ తేదీన వివాహం వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. కాగా నవంబరు 9న సాయంత్రం మంజునాథ్‌ అదృశ్యమయ్యాడు. భర్త కనిపించకపోవడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఇటీవల హొళెనరసిపుర సమీపంలోని హేమావతి కాలువలో మృతదేహం లభించడంతో  హాసన్‌ పోలీసులు ఆరా తీశారు.ఈ మృతదేహం  అదృశ్యమైన మంజునాథ్‌గా  పోలీసులు గుర్తించారు. 

మృతదేహంపై ఉన్న గుర్తును బట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్లు తేల్చారు. అన్న వరుసయ్యే వ్యక్తితో కూతురి పెళ్లి జరగడం దేవరాజ్‌ తట్టుకోలేకపోయాడు. సమాజంలో తలెత్తుకుని తిరగడం ఎలాగంటూ ఆగ్రహావేశానికి గురై ఏకంగా మంజునాథ్‌ హత్యకు కుట్ర చేశాడు. 

అల్లున్ని చంపడం కోసం రూ.5 లక్షలు సుపారిని ఓ హంతక ముఠాకు అందించి హత్య చేయించినట్లు  పోలీసుల విచారణలో తెలిసింది. నిందితులైన దేవరాజ్‌తో పాటు యోగేశ్, మంజు, చెలువ, నందన్, సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

click me!