ఢిల్లీలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌‌ల మధ్య ఎదురుకాల్పులు.. పరుగులు తీసిన జనాలు

Published : Jun 18, 2018, 12:09 PM IST
ఢిల్లీలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌‌ల మధ్య ఎదురుకాల్పులు.. పరుగులు తీసిన జనాలు

సారాంశం

ఢిల్లీలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌‌ల మధ్య ఎదురుకాల్పులు.. పరుగులు తీసిన జనాలు

దేశ రాజధాని ఢిల్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్లు అయిన.. గోగి గ్యాంగ్‌కు టిల్లు గ్యాంగ్‌కు ఆధిపత్యం, పాతగొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో బురారీ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య  ఘర్షణ జరిగి..  కాల్పులకు దారి తీసింది.. ఈ కాల్పుల్లో టిల్లు గ్యాంగ్‌లోని ముఠా సభ్యుడు రాజు మరణించాడు.. పట్టపగలు రోడ్డుపై యుద్ధవాతావరణ నెలకొనడంతో జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది..

గత వారం కూడా ఢిల్లీలోని చత్రపూర్‌లో పోలీసులకు, రాజేశ్ భారతి గ్యాంగ్‌కు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ పోరులో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ రాజేశ్ భారతితో పాటు అతని ముఠా సభ్యులు ముగ్గురు హతమయ్యారు.
 

PREV
click me!

Recommended Stories

Indian Railways: గుడిని వదలరు..గుడిలో లింగాన్ని వదలరు..మరీ ఇంత కక్కుర్తా..? ట్రైన్‍లో ఇవి కూడా వదలరా?
జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets