మ‌ణిపూర్ లో జేడీయూకు షాక్.. పార్టీని వీడి బీజేపీలో చేరిన ఐదుగురు నేత‌లు

By Mahesh RajamoniFirst Published Sep 4, 2022, 3:01 PM IST
Highlights

మ‌ణిపూర్: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా సమక్షంలో మణిపూర్‌కు చెందిన ఐదుగురు జేడీయూ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
 

మ‌ణిపూర్: భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఏన్డీఏ కూట‌మి నుంచి విడిపోయిన త‌ర్వాత ఈశాన్య భార‌తంలో జేడీయూ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాకించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో తాము విలీనం అవుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. క్ర‌మంలోనే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా సమక్షంలో మణిపూర్‌కు చెందిన ఐదుగురు జేడీయూ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఆదివారం నాడు దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మణిపూర్ శాసనసభ సెక్రటేరియట్ నుండి వెలువ‌డిన ఒక ప్రకటన ప్రకా... జోయ్‌కిషన్ సింగ్, న్గుర్‌సంగ్లూర్ సనేట్, ఎండీ అచాబ్ ఉద్దీన్, తంజామ్ అరుణ్‌కుమార్,  ఎల్‌ఎం ఖౌటే అధికార పార్టీ బీజేపీలో విలీనమయ్యారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం ఐదుగురు నాయ‌కుల‌తో కూడిన‌ జేడీయూ ను బీజేపీలో విలీనం చేసేందుకు మణిపూర్ శాసనసభ స్పీకర్ అంగీకరించడం సంతోషంగా ఉందని శాసనసభ సెక్రటేరియట్ పేర్కొంది. 

I welcome the five JDU MLAs from Manipur into the family. All of you possess qualities that will greatly benefit our party. I am certain you will all serve the nation diligently as members of the BJP & play your role in the development of the country. pic.twitter.com/RMPranmJw4

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 60 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో 32 సీట్ల మెజారిటీని సాధించింది. దాని ఫలితాలు మార్చి 10 న ప్రకటించబడ్డాయి. కాగా, జేడీయూ నేత‌ల‌ను ధ‌న బ‌లం ఉప‌యోగించుకుని త‌న‌లో బీజేపీ విలీనం చేసుకుంద‌ని జేడీయూ అగ్ర‌నేత‌లు ఆరోపిస్తున్నారు. ధనబలం ఉపయోగించి బీజేపీ విలీనం చేసిందని జేడీయూ చీఫ్ రాజీవ్ రంజన్ లాలన్ సింగ్ శనివారం అన్నారు. మణిపూర్‌లో ఏం జరిగినా (జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీలో విలీనం చేయడం) ధనబలం ఉపయోగించి బీజేపీ చేసిందని జేడీయూ చీఫ్ అన్నారు. ప్రధానికి ప్రతిపక్ష పార్టీలు కలిసి రావడం అవినీతిగా క‌నిపిస్తోంది.. కానీ వాళ్లు మాత్రం ఏమైనా చేయ‌వ‌చ్చా? అని ప్ర‌శ్నించారు. ఏదేమైనప్ప‌టికీ 2023 నాటికి JD(U) జాతీయ పార్టీ అవుతుందని అన్నారు. అవినీతి, ధర్మం నిర్వచనాన్ని ప్రధాని మోడీ మారుస్తున్నారని జేడీయూ అధినేత ఆరోపించారు. బీజేపీలో చేరిన తర్వాత అవినీతిపరుడైన వ్యక్తి క్లీన్ చిట్ అందుతుంద‌ని విమ‌ర్శించారు. 

“ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి, ధర్మానికి నిర్వచనాన్ని మారుస్తున్నారు. ప్రధాని ధనబలం వాడుతున్నారంటే అది పుణ్యమే. ప్రత్యర్థి పార్టీ ఒకే వేదికపైకి వస్తుంటే అక్కడ అవినీతి జరుగుతోంది' అని లల్లన్ అన్నారు. గతంలో అరుణాచల్ ప్రదేశ్‌లో నితీష్ కుమార్ పార్టీకి పీడకలని తెచ్చిపెట్టిన జేడీయూ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది బీజేపీలో చేరారు. తిరిగి ఆగస్టు 25న, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏకైక JDU ఎమ్మెల్యే కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సమక్షంలో చేరారు. నితీష్ కుమార్ బీజేపీని వదిలిపెట్టి, బీహార్‌ను పరిపాలించడానికి తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, ఇతర పార్టీలతో చేతులు కలిపి వారాల తర్వాత తాజా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 

click me!