Pakistan PM Shehbaz Sharif: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన తొలి బహిరంగ ప్రసంగంలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని భారతదేశానికి పిలుపునిచ్చారు. అది చట్టవిరుద్ధమైన నిర్ణయమనీ, దాన్ని ఉపసంహరించుకోవడం భారతదేశ బాధ్యతని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pakistan PM Shehbaz Sharif: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన తొలి ప్రసంగంలో కాశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని ఆయన భారత్కు పిలుపునిచ్చారు. ఆసియాలో మన్నికైన శాంతి కోసం, ఆగస్టు 5, 2019 నాడు కశ్మీర్లో చేసిన రాజ్యాంగ విరుద్ద అంశాన్ని తిరిగి పునరుద్దరించాలని షరీఫ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. జమ్మూ కాశ్మీర్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు వీలుగా భారత్.. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని పాక్ ప్రధాని సూచించారు.
"ఆసియాదేశాలలో శాంతి ప్రాబల్యం కోసం.. ఆగస్ట్ 5, 2019 నాటి ఏకపక్ష, చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం భారతదేశ బాధ్యత, తద్వారా జమ్మూ & కాశ్మీర్ సమస్య చర్చలతో పరిష్కరించబడుతుంది" అని షరీఫ్ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధాని అయిన తర్వాత తన ప్రారంభ ప్రసంగంలో కాశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. "మన రాబోయే తరాలు బాధపడాలని మనం ఎందుకు భావిస్తున్నాం రండి, ఐక్యరాజ్యసమితి తీర్మానాలు, కాశ్మీరీల అంచనాలకు అనుగుణంగా కాశ్మీర్ సమస్యను పరిష్కరిద్దాం, తద్వారా సరిహద్దుకు ఇరువైపులా పేదరికాన్ని అంతం చేయగలుగుతాం" అని షెహబాజ్ ఉటంకించారు.
ఆర్టికల్ 370 రద్దు పై పాక్ అసంతృప్తి
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్ర వ్యతిరేకించింది. ఈ చర్య తర్వాత.. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు చాలా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370ని రద్దు చేయడం తమ అంతర్గత వ్యవహారమని భారత్ పదే పదే అంతర్జాతీయ సమాజానికి చెప్పింది. అయినా పాకిస్థాన్ మాత్రం తన వక్రబుద్దిని మార్చుకోవడం లేదు. షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధాని అయిన తర్వాత తన మొదటి బహిరంగ ప్రసంగంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయం.
ఆర్థికంగా దెబ్బతిన్న పాకిస్థాన్
పాకిస్థాన్లో ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతుండగా, పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. లీటరుకు రూ.30 మేర పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.179.86గా ఉండగా.. లీటర్ డీజిల్ రూ.174.15లుగా నమోదైంది. చమురు ధరల పెరుగుదలతో.. రోజువారీ అవసరాల ధరలపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ఈ తరుణంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది.
పాక్ ప్రభుత్వంపై ఇమ్రాన్ నిరసన గళం
జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ద్వారా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను రాజ్యాంగబద్ధంగా పదవి నుండి తొలగించారు, పాకిస్తాన్ రాజకీయాల్లో ఒక్క క్షణం కూడా లేదు. పాక్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి ఆరు రోజుల గడువు విధించారు. ఆరు రోజుల్లోపు ఎన్నికల తేదీలను ప్రకటించకపోతే మరోసారి ఇస్లామాబాద్ కు యావత్ దేశాన్ని వెంట పెట్టుకుని వస్తానని హెచ్చరించారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. మరోవైపు భారత ప్రభుత్వాన్ని ప్రశంసించాడు. ఈ క్రమంలో షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా తొలి మొదటి బహిరంగ ప్రసంగంలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తారు, ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని పిలుపునివ్వడం గమనార్హం.