ఒడిశాలో ఘోర ప్రమాదం.. బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు.. నలుగురు మృతి

Published : Mar 06, 2023, 01:55 PM IST
ఒడిశాలో ఘోర ప్రమాదం.. బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు.. నలుగురు మృతి

సారాంశం

ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారు చేస్తుండగా జరిగిన పేలుడులో నలుగురు మృతిచెందారు.

ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారు చేస్తుండగా జరిగిన పేలుడులో నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఖోర్ధా జిల్లా పరిధిలోని భూసందపూర్ గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. డోలా పండుగను దృష్టిలో ఉంచుకుని భూసందపూర్ గ్రామంలోని ఓ చోట 10 మందికి పైగా పటాకులు తయారు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ పేలుడులో గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కూడా చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

PM Modi: 10 కోట్లు దాటిన మోదీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు.. ప్ర‌ధానికి సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బులొస్తాయా.?
Toll Pass : కేవలం రూ.340 టోల్ పాస్.. నెెలంతా ఫ్రీగా తిరగొచ్చు..!