SemiconIndia Conference 2023: ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారైన భార‌త్.. నేడు ఎగుమతి చేస్తోంది: ప్రధాని మోడీ

Published : Jul 28, 2023, 02:41 PM IST
SemiconIndia Conference 2023: ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారైన భార‌త్.. నేడు ఎగుమతి చేస్తోంది: ప్రధాని మోడీ

సారాంశం

SemiconIndia Conference 2023: దేశంలో సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు టెక్నాలజీ కంపెనీలకు 50 శాతం ఆర్థిక సహాయం అందిస్తామని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందన్నారు. సెమీకండక్టర్ డిజైన్ పై కోర్సులు ప్రారంభించడానికి భారత్ లో 300 పాఠశాలలను గుర్తించినట్లు తెలిపారు.  

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో రెండో రోజైన శుక్రవారం గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్ లో సెమీకండక్టర్ పరిశ్రమకు సంబంధించిన ఎగ్జిబిషన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ''సెమికాన్ ఇండియా సమ్మిట్ 2023'' లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడం ఎంత అవసరమో, ఈ ప్రోగ్రామ్ కూడా అంతే అవసరమని అన్నారు. పరిశ్రమలు, నిపుణులు, విధాన నిర్ణేతలతో సంబంధాలను సెమికాన్ ఇండియా ద్వారా అప్ డేట్ చేస్తారు. సంబంధాలలో సమన్వయానికి ఇది అవసరమని తాను నమ్ముతున్నాన‌ని చెప్పారు.

దేశంలో సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు టెక్నాలజీ కంపెనీలకు 50 శాతం ఆర్థిక సహాయం అందిస్తామని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందన్నారు. సెమీకండక్టర్ డిజైన్ పై కోర్సులు ప్రారంభించడానికి భారత్ లో 300 పాఠశాలలను గుర్తించినట్లు తెలిపారు. గతేడాది సెమికాన్ ఇండియా మొదటి ఎడిషన్ లో తామంతా పాల్గొన్నామని ప్రధాని చెప్పారు. ''భారత్ లో సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలని అప్పట్లో చర్చ జరిగింది. ఏడాది తర్వాత ఇప్పుడు కలుస్తున్నప్పుడు ప్రశ్న మారింది. ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదని చెబుతున్నారు. ప్రశ్నే కాదు గాలి దిశ కూడా మారిపోయింది. ఈ మార్పు మీ నుండి మరియు మీ ప్రయత్నాల నుండి వచ్చింది. మీరు కనెక్ట్ అయ్యారు, మీ భవిష్యత్తు భారతదేశ ఆకాంక్షలతో ముడిపడి ఉంది. మీరు మీ కలలను భారతదేశ సామర్థ్యంతో ముడిపెట్టారు.. భారతదేశం ఎవరినీ నిరాశపరచదు'' అని తెలిపారు.

భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రెండేళ్లలో రెట్టింపు అయ్యాయని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశ డిజిటల్ రంగం, ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో వేగవంతమైన వృద్ధిని మనం చూస్తున్నామని పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం భారతదేశం ఈ రంగంలో అభివృద్ధి చెందుతున్న ద‌శ‌లో ఉండ‌గా, నేడు ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీలో మన వాటా అనేక రెట్లు పెరిగిందని తెలిపారు. 2014లో భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 30 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంది. నేడు అది 100 బిలియన్ డాలర్లను దాటింది. భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు కేవలం రెండేళ్లలోనే రెట్టింపు అయ్యాయి. భారత్ లో తయారైన మొబైల్ ఫోన్ల ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న ఈ దేశం నేడు ప్రపంచంలోనే అత్యుత్తమ మొబైల్ ఫోన్లను తయారు చేసి ఎగుమతి చేస్తోందని తెలిపారు. అలాగే, నేడు యావ‌త్ ప్ర‌పంచం 4.0 పరిశ్రమను చూస్తోందని ప్రధాని అన్నారు. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడల్లా దాని పునాది ఏ ప్రాంత ప్రజల ఆకాంక్షలైనా.. మునుపటి పారిశ్రామిక విప్లవాలకు, అమెరికా స్వప్నానికి మధ్య ఉన్న సంబంధాన్ని నేడు నాల్గవ పారిశ్రామిక విప్లవానికి, భారతీయ ఆకాంక్షలకు మధ్య అదే సంబంధాన్ని తాను చూడగలనని చెప్పారు.

అంత‌కుముందు, గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో గురువారం గుజరాత్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మొత్తం మంత్రులు హాజరయ్యారు. మంత్రులంతా తమ తమ శాఖలు చేస్తున్న ప్రధాన పనుల గురించి ప్రధానికి సవివరంగా వివరించారు. కీలక పథకాలు, ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికల వివరాలను మంత్రులు పంచుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !