హోటల్‌లో వాస్తు సిద్ధాంతి చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య.. సీసీటీవీ‌లో దృశ్యాలు..

By Sumanth KanukulaFirst Published Jul 5, 2022, 3:41 PM IST
Highlights

కర్ణాటకలో ప్రముఖ వాస్తు సిద్ధాంతి చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అంగడి దారుణ హత్యకు గురయ్యాడు. Hubballi‌లో ఓ ప్రైవేటు హోటల్‌లో ఆయనపై దాడి చేసిన దుండగులు దారుణంగా హత్య చేశారు.

కర్ణాటకలో ప్రముఖ వాస్తు సిద్ధాంతి చంద్రశేఖర్ గురూజీ అలియాస్ చంద్రశేఖర్ అంగడి దారుణ హత్యకు గురయ్యాడు. Hubballi‌లో ఓ ప్రైవేటు హోటల్‌లో ఆయనపై దాడి చేసిన దుండగులు దారుణంగా హత్య చేశారు. దుండగులు భక్తుల వేషధారణలో అతడి వద్దకు వచ్చారు. హోటల్ రిసెప్షన్‌లో కత్తితో అతడిపై దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు  అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించడంతో పాటుగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

పోలీసు కమిషనర్ లాభూరామ్, లా అండ్ ఆర్డర్ డిసిపి సాహిల్ బాగ్లా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హోటల్‌ వద్దకు డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు నిర్వహించారు. మృతదేహాన్ని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి చంద్రశేఖర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. 

ఇద్దరు దుండగులు చంద్రశేఖర్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్తున్న దృశ్యాలు హోటల్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. చంద్రశేఖర్ జులై 2న హోటల్‌కు వచ్చారని.. జూలై 6న గది ఖాళీ చేయాల్సి ఉందని హోటల్ సిబ్బంది తెలిపారు. అయితే నిందితులు చంద్రశేఖర్‌ను అత్యంత దారుణంగా పొడిచి హత్య చేశారని.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది. 

ఇక, చంద్రశేఖర్ 2002లో CG పరివార్ పేరుతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు.  2016లో సరళ జీవన పేరుతో ఇన్ఫో ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానెల్‌ని ప్రారంభించారు. కర్ణాటకలో ప్రముఖ వాస్తు సిద్దాంతి పేరుగాంచిన చంద్రశేఖర్..సరళ వాస్తు టీవీ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. సరళ వాస్తుపై అనేక పుస్తకాలు రాశారు. చంద్రశేఖర్ దాదాపు 2000 సెమినార్లలో ప్రసంగించారు. 16 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆయన సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్చర్‌లో డాక్టరేట్ పొందాడు. వాస్తు కార్యక్రమాల ద్వారా ఆయన కర్ణాటకలో చాలా ప్రాచుర్యం పొందారు. 

click me!