ఎయిర్‌పోర్టు అధికారులకు షాక్.. సాధ్వి లగేజీ బ్యాగ్‌లో మనిషి పుర్రె, అస్థికలు

Published : Sep 09, 2021, 03:59 PM IST
ఎయిర్‌పోర్టు అధికారులకు షాక్.. సాధ్వి లగేజీ బ్యాగ్‌లో మనిషి పుర్రె, అస్థికలు

సారాంశం

ఓ సాధ్వి విమానాశ్రయ అధికారులకు ఊహించని షాక్ ఇచ్చారు లగేజీ బ్యాగులో మనిషి పుర్రె, అస్థికలు తీసుకెళ్లి ఖంగుతినిపించారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆమెను విచారించారు.

ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్ విమానాశ్రయ అధికారులకు ఓ సాధ్వి షాక్ ఇచ్చారు. మనిషి పుర్రె, అస్థికలను ఓ బ్యాగ్‌లో భద్రంగా తీసుకెళ్లి ఖంగుతినిపించారు. ఇండోర్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి ఆమె ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఉజ్జయిన్ నుంచి బయల్దేరి వచ్చిన సాధ్వి యోగ్మాత తీరుపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లగేజీ స్కాన్నింగ్ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధ్వి బ్యాగ్‌నూ స్కాన్ చేయగా అనుమానాస్పదంగా తోచింది. బ్యాగ్ తెరవాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఆమె బ్యాగ్ తెరిచారు. దీంతో ఖంగుతినడం అధికారుల వంతు అయింది. ఆ స్టాఫ్ వెంటనే ఎయిర్‌పోర్ట్ అథారిటీకి విషయం తెలియజేశారు. ఆ అస్థికలతో సాధ్విని విమానంలో ప్రయాణించడానికి అధికారులు నిరాకరించారు. పోలీసులకు విషయం చెప్పారు. 

సాధ్విని పోలీసులు విచారించారు. ఆ అస్థికలు తన దివంగత గురువులవని చెప్పినట్టు ఓ పోలీసు అధికారి వివరించారు. వాటిని హరిద్వార్ తీసుకెళ్లి గంగలో కలపాలని భావిస్తున్నట్టు చెప్పారని పేర్కొన్నారు.  

ఆ అస్థికలతో విమానంలో ప్రయాణించడానికి అనుమతులు లేకపోవడంతో అధికారులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో వాటిని తోటి సన్యాసులకు అప్పగించారు. వారు వాటిని రోడ్డు ద్వారా హరిద్వార్‌కు వెళ్లగా, సాధ్వి మరో విమానంలో ఢిల్లీకి బయల్దేరారు.

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu