
ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరుకుంది. కానీ, ఇరుదేశాల మధ్య యుద్దం తీవ్రస్థాయిలో ఉండగా.. యుద్ద భూమిలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా భారత్కు తీసుకురావడంలో ప్రభుత్వం ఎలా విజయం సాధించిందో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వివరించారు. యుద్ధ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తిరిగి రావడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రెసిడెంట్ పుతిన్ మరియు జెలెన్స్కీకి ఫోన్ చేశారని,ఆ తర్వాతే తాము మనవిద్యార్థులను సురక్షితంగా తీసుకురాగలిగామని ఆయన అన్నారు.
గుజరాత్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం ఓ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఒక కథనాన్ని గుర్తుచేసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మన విద్యార్థులు 20 వేల మందికి పైగా అక్కడ చిక్కుకుపోయారని చెప్పారు. అందులో సుమీ, ఖార్కివ్ అనే రెండు నగరాలు ఉంటున్న భారత విద్యార్థులు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నారు. ఆ నగరాల్లో రోజూ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. రష్యా సైన్యం సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందనీ, ఈ క్రమంలో ఎన్నో వేలాది మంది చనిపోయారని తెలిపారు.
చుట్టుపక్కల బుల్లెట్లు తిరుగుతున్న సమయంలో..ఎవరు బయటకు వస్తారని విదేశాంగ మంత్రి అన్నారు. సుమీలో విద్యార్థులను తరలించేందుకు బస్సులో కూడా వెళ్లామని, కానీ, కాల్పులు జరపడంతో విద్యార్థులు వెనుదిరిగారన్నారు. ఘటన తరువాత.. ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫోన్ చేశారని తెలిపారు. భారతీయ విద్యార్థుల గురించి వారితో మాట్లాడారనీ, ఇక్కడ చిక్కుకుపోయిన భారతీయుల గురించి ప్రధాని మోదీ ఇరు దేశాల అధినేతలకు చెప్పారు.
వారిని ఇక్కడి నుండి బయటకు తీసుకురావడానికి కొంత నిర్ణీత సమయం ఇవ్వాలని, తద్వారా తాము మా ప్రజలను సురక్షితంగా ఇక్కడి నుండి బయటకు తీసుకురాగలమని తెలిపారు. దీని తర్వాత ఉక్రెయిన్ల నుంచి మన ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
రష్యాతో భీకర యుద్ధం నడుస్తుండగా, ఉక్రెయిన్లోని సుమీ మరియు ఖార్కివ్లలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులందరినీ రక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ గంగా అనే కార్యక్రమం ప్రారంభించింది. ఉక్రెయిన్లోని వివిధ నగరాలకు చెందిన విద్యార్థులను ఆపరేషన్ గంగా కింద భారత్కు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక విమానాలను పంపింది. ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ నుంచి 22 వేల మంది భారతీయులను తరలించారు. సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను రక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది మార్చి 7న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో టెలిఫోనిక్ సంభాషించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి భారత్ మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. యుద్దం ఎటువంటి పరిష్కారం కనుగొనబడదని భారతదేశం స్థిరంగా వాదిస్తోంది. అలాగే..యుద్ధాన్ని ఎవరికీ ప్రయోజనం కలిగించదు. శత్రుత్వాలను తక్షణమే ముగించి, చర్చలు, దౌత్య మార్గానికి తిరిగి రావడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని భారతదేశం స్థిరంగా చెబుతోంది. యుద్ధం మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఉద్దేశించిన అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం సిద్ధంగా ఉంది.