రెండు ట్రక్కుల మధ్య నలిగిపోయిన కారు.. 10 మంది దుర్మరణం

sivanagaprasad kodati |  
Published : Dec 31, 2018, 10:24 AM IST
రెండు ట్రక్కుల మధ్య నలిగిపోయిన కారు.. 10 మంది దుర్మరణం

సారాంశం

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కచ్ జిల్లాలోని భవాచ్ జాతీయ రహదారిపై ఉప్పు లోడుతో వెళుతున్న ట్రక్కు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలికి వెళ్లింది. ఈ సమయంలో అటుగా వస్తున్న కారును ఢీకొట్టింది

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కచ్ జిల్లాలోని భవాచ్ జాతీయ రహదారిపై ఉప్పు లోడుతో వెళుతున్న ట్రక్కు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలికి వెళ్లింది. ఈ సమయంలో అటుగా వస్తున్న కారును ఢీకొట్టింది..

అదే సమయంలో అటుగా వస్తున్న మరో ట్రక్కు కూడా కారును ఢీకొట్టింది. దీంతో రెండు ట్రక్కుల మధ్య చిక్కుకుని కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 10 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు..

భుజ్‌లోని తమ స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద విషయం తెలుసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?