యూపీ పౌర ఎన్నికల్లో బీజేపీ అద్భుత ఫలితాలు.. పస్మాండ ముస్లింల‌కు చేరువకావడంతోనే.. : డానిష్ ఆజాద్ అన్సారీ

Published : May 14, 2023, 11:31 AM IST
యూపీ పౌర ఎన్నికల్లో బీజేపీ అద్భుత ఫలితాలు.. పస్మాండ ముస్లింల‌కు చేరువకావడంతోనే.. : డానిష్ ఆజాద్ అన్సారీ

సారాంశం

UP civic polls: ఉత్తరప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ మాట్లాడుతూ ముస్లిం సమాజాన్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవాలని కోరుకోవడం లేదన్నారు. అలాగే, పౌర ఎన్నికలలో బీజేపీ అసాధారణ పనితీరుకు కార‌ణం ముస్లిం పస్మాండ కమ్యూనిటీక పార్టీ చేరువ కావడమేన‌ని ఆయ‌న పేర్కొన్నారు.  

UP Minority Affairs Minister Danish Azad Ansari: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అద్భుత ప్రదర్శన కనబర్చడానికి ముస్లిం పస్మాండా సామాజిక వర్గానికి పార్టీ చేరువ కావడమే కారణమని  ఆ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ అన్నారు. పస్మాండ సామాజికవర్గానికి చేరువయ్యేందుకు పార్టీ అగ్రనాయకత్వం, ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం అసాధారణ ఫలితాలను ఇచ్చిందని అన్సారీ తెలిపారు. ముస్లిం సమాజాన్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవాలని కోరుకోవడం లేదన్నారు. ముస్లింలలో కనీసం 80 నుండి 85 శాతం మంది పస్మాండ కమ్యూనిటీకి చెందినవారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి ఓటు చాలా ముఖ్యం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, రేషన్ పథకం ద్వారా పస్మాండ కమ్యూనిటీ లబ్ధి పొందిందని మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అంగీకరించారు.

ముస్లింలు ఓటు బ్యాంకు కోరుకోవడం లేదు.. 

ముస్లిం సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకోకూడదని పార్టీ నాయ‌క‌త్వం నిర్ణయించిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఆయనకు అభివృద్ధిపై నమ్మకం ఉందని సూచిస్తోందని కూడా పేర్కొన్నారు. 

ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన పస్మాండ ముస్లింలు

నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చిన 35 ఏళ్ల మంత్రి..  ఓటు వేయడానికి ప‌స్మాండ సామాజిక వర్గానికి చెందిన‌ ముస్లింలు పెద్ద సంఖ్యలో రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఎన్నికల్లో పస్మాండ‌ సామాజికవర్గం అత్యధిక స్థానాల నుంచి వచ్చిన ముస్లిం అభ్యర్థుల గెలుపునకు దోహదపడిందన్నారు. ఓటింగ్ శాతం కూడా పెరిగిందని తెలిపారు. "పస్మాండా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ముస్లిం అభ్యర్థుల విజయానికి దోహదపడటం సంతోషంగా ఉంది. పార్టీ అధ్యక్ష పదవికి 20 మంది, కౌన్సిలర్ పదవికి 300 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపాము. ఫలితాలు కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని" మంత్రి అన్నారు.

ప‌స్మాండ ముస్లింల గురించి సీఎంతో చ‌ర్చ‌లు.. 

రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ధరంపాల్ సైనీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ లతో సుదీర్ఘంగా చర్చించినట్లు అన్సారీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తగిన అభ్యర్థులను గుర్తిస్తామని చెప్పారు. ఆ తర్వాతే మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించారు.

అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపిన ఆజాద్ అన్సారీ

ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపినందుకు బీజేపీ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఆ సామాజిక వర్గానికి చేరువయ్యేందుకు అనేక చర్యలు చేపట్టిందని బీజేపీ నేత తెలిపారు. మదర్సాల్లో సైన్స్, ఆధునిక విద్యను ప్రవేశపెట్టడం, ముస్లిం యువతకు జాబ్ మేళాలు నిర్వహించడం వంటివి ఇందులో ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mahindra Scorpio N : భారీ మార్పులతో స్కార్పియో వచ్చేస్తోంది.. ధర ఎంతో తెలుసా..?
Lactobacillus Bulgaricus: బ్యాక్టీరియా కూడా రాష్ట్ర గుర్తేనా? కేరళ రికార్డ్ | Asianet News Telugu