రామమందిర ప్రాణ్ ప్రతిష్ట : 11 రోజుల ప్రత్యేక ఆచారాలపై ప్రధాని మోదీ ఆడియో సందేశం..

By SumaBala BukkaFirst Published Jan 12, 2024, 10:04 AM IST
Highlights

అయోధ్యలో నేటి నుంచి 11 రోజుల ప్రత్యేక ఆచారాలకు కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యేక ఆడియో సందేశం ద్వారా జాతికి తెలిపారు.

న్యూఢిల్లీ : రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా 11 రోజులు మిగిలి ఉన్నందున, ఆ శుభకార్యానికి సాక్షిగా ఉండడం తన అదృష్టమని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యేక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. జనవరి 22వ తేదీ వరకు 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

“అయోధ్యలో రాంలాలా దీక్షకు కేవలం 11 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ శుభ సందర్భానికి నేనూ సాక్షిని కావడం నా అదృష్టం. ప్రతిష్ఠాపన సమయంలో భారతదేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించడానికి దేవుడు నన్ను ఒక సాధనంగా చేసాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు నుంచి 11 రోజుల ప్రత్యేక క్రతువును ప్రారంభిస్తున్నాను. ప్రజలందరి ఆశీస్సులు కోరుతున్నాను. ఈ తరుణంలో నా భావాలను మాటల్లో చెప్పడం చాలా కష్టంగా ఉంది, కానీ నేను నా వైపు నుండి ప్రయత్నించాను” అని ఆడియో సందేశాన్ని పంచుకున్నారు.
 

Latest Videos

 

click me!